మిస్టర్ కూల్ పై మిస్టర్ ఐపిఎల్ ప్రశంసల వర్షం?

Purushottham Vinay
ఇక బుధవారం నాడు జరిగిన ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ టీంపై చెన్నై సూపర్ కింగ్స్ టీం ఏకంగా 15 పరుగుల తేడాతో విజయం సాధించి, నేరుగా టోర్నీ ఫైనల్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.అందువల్ల ఐపీఎల్ చరిత్రలో 10వ సారి టోర్నీ ఫైనల్‌కి చేరిన టీం గా కూడా ధోని సేన సూపర్ డూపర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ నేపథ్యంలో చెన్నై టీమ్ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై ఆ టీం మాజీ ప్లేయర్ సురేష్ రైన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోని తాకిన ప్రతిదీ కూడా బంగారంగా మారుతుందని, ఇక చెపాక్ స్టేడియంలో చెన్నై టీమ్‌ని ఓడించడం అంటే పెద్ద సవాలేనని రైనా పేర్కొన్నాడు.


మిస్టర్ ఐపిఎల్ సురేష్ రైనా మాట్లాడుతూ.. ' ధోని తాకితే ఏదైనా కూడా ఖచ్చితంగా బంగారంగా మారుతుంది. ఈ సీజన్‌లో ధోని నేతృత్వంలోని చెన్నై టీమ్ ఐపీఎల్ ట్రోఫీ గెలవాలని దేశంలోని క్రికెట్ అభిమానులంతా కూడా ఎంతగానో కోరుకుంటున్నారు. గుజరాత్‌ టైటాన్స్‌ టీంపై గెలవడం ద్వారా చెన్నై టీమ్ ఏకంగా పదో సారి ఐపీఎల్ ఫైనల్‌కి చేరింది. 
ధోని సేన ఆడిన మొత్తం 14 సీజన్‌లలో 12 సార్లు ప్లేఆఫ్స్ ఇంకా 10 ఫైనల్స్‌కు ఎలా చేరుకున్నారో మీరే చూడండి, ఇది నిజంగా చాలా గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను.అయితే ఎంఎస్ ధోని మాత్రం దానిని చాలా సింపుల్‌గా తీసుకుంటాడు. కానీ దీనంతటికి కూడా అతనే కారణం, ధోనీ కోసం అయినా ఈ టోర్నీ టైటిల్ ఖచ్చితంగా గెలవాలని రుతురాజ్ గైక్వాడ్ నాతో చెప్పాడ'ని తెలిపాడు.


ఇక ప్రతిష్టాత్మక ఐపీఎల్ లీగ్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 4 సార్లు విజేతగా నిలిచింది.అలాగే మరోవైపు చెన్నై చేతిలో ఓడిన గుజరాత్ టీం రెండో క్వాలిఫైయర్‌లో ముంబై ఇండియన్స్‌ టీంతో తలపడనుంది. ఇక బుధవారం నాడు జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ముంబై టీమ్ ఏకంగా 81 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో క్వాలిఫైయర్‌కి కూడా అర్హత సాధించింది.ఇక రెండో క్వాలిఫైయర్‌లో గెలిచిన టీమ్(గుజరాత్ లేదా ముంబై)తో చెన్నై సూపర్ కింగ్స్ టీం టోర్నీ ఫైనల్‌లో ఈ నెల 28న తలపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: