IPL 2023 క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్ టీంతో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టీం చాలా అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.దీంతో సీఎస్కే టీం 10వ సారి కూడా ఐపీఎల్ ఫైనల్స్కు చేరుకుంది.ఇక ఇదిలా ఉంటే.. ఫైనల్కు ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ టీంకు చాలా పెద్ద గట్టి షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఆ టీం కెప్టెన్ అయిన ఎం.ఎస్ ధోనిపై ఒక మ్యాచ్ నిషేధం విధించే ఛాన్స్ ఉందని క్రికెట్ వర్గాలు కూడా చెబుతున్నాయి.ఇక గుజరాత్ టైటాన్స్ టీంతో జరిగిన క్వాలిఫియర్-1లో 16వ ఓవర్ సమయంలో ఎమ్ ఎస్ ధోని అంపైర్తో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. సుమారు 4 నిమిషాల సమయాన్ని ధోని వృథా చేయడం జరిగింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఆ మ్యాచ్ రిఫరీ.. ఖచ్చితంగా ధోనిపై ఫైన్ లేదా ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో పలు కథనాలు ప్రచురితమయ్యాయి.
ఇంకా అలాగే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా ఈ విషయంపై ఆరా తీసునట్లు సమాచారం తెలుస్తుంది.ఇక ధోనిపై నిషేధం కనుక పడితే మాత్రం.. ఫైనల్కు ముందుగా చెన్నై జట్టుకు చాలా పెద్ద ఎదురుదెబ్బ తగులుతుందని చెప్పాలి. ఇక దీనిపై తుది నిర్ణయం మ్యాచ్ రిఫరీపై ఆధారపడి ఉందని సమాచారం తెలుస్తోంది.ఇక గుజరాత్ ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసే సమయానికి సీఎస్కే టీం బౌలర్ మతీషా పతిరాణా దాదాపు 9 నిమిషాలు పాటు మైదానంలో కనిపించలేదు.ఇక అతడు సరాసరి డగౌట్ నుంచే బౌలింగ్కి వచ్చాడు.దీంతో అంపైర్లు మతీషాను అడ్డుకోవడం జరిగింది.ఇంకా అతన్ని బౌలింగ్ చేయకూడదని వారించారు.ఇక ఈలోగా ధోని వచ్చి.. వివాదాన్ని కాస్తా సద్దుమనిగించాడు. అయితే ఐపీఎల్ రూల్స్ ప్రకారం.. ఓ ఆటగాడు మ్యాచ్ జరిగే సమయంలో ఎనిమిది నిమిషాలకు పైగా గ్రౌండ్లో కనుక లేకపోతే అంపైర్లు అతడిపై ఇలా చర్యలు తీసుకోవచ్చు.