అది ధోని క్రేజ్ అంటే.. సింహం ఎంట్రీ ఇస్తే అంతే?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మామూలుగానే ధోనికి ఉన్న క్రేజ్ చూస్తే మతిపోతుంది. అలాంటిది ఇక అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని కేవలం ఐపిఎల్ లో మాత్రమే కనిపిస్తూ ఉండడంతో అతని ఆటను చూడడానికి ఇక ప్రతి సీజన్లో కూడా అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. అయితే మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ వార్తలు వస్తూ ఉండడంతో చెన్నై హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ జరగకపోయినా ఎక్కడ సీఎస్కే మ్యాచ్ ఆడిన అక్కడికి తరలి వెళ్తున్నారు.

 ఈ క్రమంలోనే మహేంద్ర సింగ్ ధోని కనిపించాడు అంటే చాలు అభిమానులు పూనకం వచ్చినట్లుగా ఊగిపోతున్నారు అని చెప్పాలి. ఇక అతని బ్యాటింగ్ చూసేందుకు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక మహేంద్ర సింగ్ ధోని మైదానంలో అడుగుపెట్టి ఒక్క బంతి ఆడిన చాలు అన్నట్లుగా అభిమానులు అందరూ కూడా పరితపించిపోతున్నారు అని చెప్పాలి. అయితే ఇక ధోని ఆట గురించి అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో అన్న విషయం ఇటీవల చపాక్ స్టేడియం లో నిరూపితం అయింది.

 ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో అంబటి రాయుడు అవుట్ కాగానే ధోని ఎంటర్ అవుతున్న సమయంలో స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో దద్దరిల్లిపోయింది. అయితే ధోని క్రేజ్ చూసి కనీసం స్టార్ స్పోర్ట్స్ అడ్వర్టైజ్మెంట్ వేయడానికి కూడా ధైర్యం చేయలేదు. సాధారణంగా బ్యాట్స్మెన్ ఔట్ అయినా లేదంటే ఓవర్ పూర్తయిన స్టార్ స్పోర్ట్స్ యాడ్స్ వేయడం చూస్తూ ఉంటాం. కానీ ధోనికున్న క్రేజ్ దృశ్య స్టార్ స్పోర్ట్స్ యాడ్ వేయలేని పరిస్థితి ఏర్పడింది  కేవలం ధోని కోసం కోట్ల రూపాయలు యాడ్ ను వదులుకుంది. అంతేకాదు ధోని మైదానంలోకి వస్తున్న సమయంలో ఇక వ్యూయర్షిప్ ఒకసారిగా 1.8 కోట్లు దాటిపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: