ఐపీఎల్ : కొత్త కెప్టెన్ తో.. ఆ జట్టు బరిలోకి?
నేడు ఏకంగా రెండు మ్యాచ్లు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ లక్నో జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ మ్యాచ్ లో లక్నో జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మొన్నటికి మొన్న అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు కెప్టెన్ గా ఉన్న కే ఎల్ రాహుల్ తీవ్రంగా గాయపడ్డాడు అన్న విషయం తెలిసిందే. దీంతో వెంటనే మైదానం వీడాడు. ఇక కె.ఎల్ రాహుల్ బయటికి వెళ్ళిన తర్వాత ఇక కృనాల్ పాండ్య జట్టు సారధ్య బాధ్యతలు భుజాన వేసుకొని ముందుకు నడిపించాడు.
ఆ మ్యాచ్లో తీవ్రంగా గాయపడిన కేఎల్ రాహుల్.. ఇంకా పూర్తిగా కోలుకోలేదు అన్నది తెలుస్తుంది. అదే సమయంలో అటు ఐపిఎల్ ముగిసిన వెంటనే డబ్ల్యూటీసి ఫైనల్ ఉన్న నేపథ్యంలో రాహుల్తో రిస్కు చేసేందుకు అటు బీసీసీఐ కూడా సిద్ధంగా లేదట. దీంతో నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో జరగబోయే మ్యాచ్లో లక్నో జట్టుకు కృనాల్ పాండ్య సారథ్యం వహించబోతున్నాడట.ఈ విషయాన్ని ఇటీవలే క్రిక్ బజ్ వెల్లడించింది. అయితే కేఎల్ రాహుల్ ప్రస్తుతం బీసీసీఐ ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు అన్నది తెలుస్తుంది.