WPL Final 2023: ఏ టీమ్స్ టాప్ లో ఉన్నాయి?

Purushottham Vinay
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చాలా గా జరుగుతున్న సంగతి తెలిసిందే. IPL కి ఏమాత్రం తగ్గకుండా చాలా ఆసక్తికరంగా సాగుతుంది. మహిళా క్రికెటర్లు మగవాళ్ళకి ధీటుగా చాలా బాగా ఆడుతూ ఆడియన్స్ ని బాగా ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఇక ఈ టోర్నీలో పాయింట్ల పట్టికలో మొదటి నుంచీ కూడా ముంబై జట్టు అగ్రస్థానంలో దూసుకుపోతూ నెంబర్ 1 గా కొనసాగుతోంది. ఇప్పటికీ ఆ జట్టు స్థానం ఇంకా చెక్కుచెదరలేదు.ఈ డబ్ల్యూపీఎల్ మార్చి 4 వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. డబ్ల్యూపీఎల్ లో ఇప్పటి దాకా మొత్తం 16 మ్యాచులు జరిగాయి. అందులో ముంబై ఇండియన్స్ 6 మ్యాచులు ఆడగా అందులో ఆ జట్టు 5 మ్యాచుల్లో గెలిచింది. దీంతో 10 పాయింట్లతో లిస్టులో అగ్రస్థానంలో ఉంది.తరువాత ఢిల్లీ క్యాపిటల్స్ 6 మ్యాచులు ఆడి మొత్తం 4 గెలిచింది. 8 పాయింట్లతో ఆ జట్టు రెండో స్థానంలో ఉంది. ఇంకా అలాగే యూపీ వారియర్స్ 6 మ్యాచులు ఆడి మొత్తం 3 మ్యాచుల్లో గెలిచింది.


ఈ జట్టు 6 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.ఇక, ఆర్సీబీ ఇంకా గుజరాత్ జెయింట్స్ చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆర్సీబీ, గుజరాత్ జెయింట్స్ ఇప్పటి దాకా మొత్తం ఏడేసి మ్యాచులు ఆడాయి. రెండు జట్లు కూడా కేవలం రెండేసి మ్యాచుల్లో మాత్రమే గెలిచాయి.దీంతో రెండు జట్లకూ కూడా మొత్తం నాలుగేసి పాయింట్లు ఉన్నాయి. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా అలాగే యూపీ వారియర్స్ జట్లలో ఓ జట్టు ఈ డబ్ల్యూపీఎల్ గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. కాగా, ఈ నెల 24 వ తేదీన డీవై పాటిల్ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచు ఈ నెల 26 వ తేదీన ఉంటుంది.ఇక చూడాలి ఫైనల్ మ్యాచ్ లో ఏ జట్టు విజేతగా నిలుస్తుందో. WPL ఫైనల్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ అభిమానులంతా కూడా వేయి కళ్ళతో ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఏ జట్టు WPL కప్ కొట్టబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: