ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 3వ టెస్టులో టీమిండియా బౌలర్ ఉమేశ్ యాదవ్ భగభగమంటూ నిప్పులు చెరిగాడు.కేవలం 5 ఓవర్లు వేసిన అతను 12 పరుగులిచ్చి 3 మెయిన్ వికెట్లు నేలకూల్చాడు. మొదట స్టార్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ను ఎల్బీగా ఔట్ చేసిన ఉమేశ్ యాదవ్ ఇక ఆ తర్వాత మిచెల్ స్టార్క్ ఇంకా మర్ఫీలను బుల్లెట్లలాంటి బంతులతో క్లీన్ బౌల్డ్ చేశాడు. టీమిండియా పేస్ బౌలర్ మెరుపు బంతులకు స్టా్ర్క్ ఇంకా మర్ఫీ వికెట్లు గాల్లో ఎగరడం విశేషం. ఉమేశ్తో పాటు రవీంద్ర జడేజా అలాగే అశ్విన్ కూడా బాగా రాణించడంతో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 197 పరుగులు చేసింది. అందువల్ల మొదటి ఇన్నింగ్స్లో 88 పరుగులు కీలక ఆధిక్యాన్ని సంపాదించుకుంది. ఓవర్నైట్ స్కోరు 156/4తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ ఉమేశ్ ఇంకా అశ్విన్ల ధాటికి కేవలం 41 పరుగులు యాడ్ చేసి చివరి 6 వికెట్లు కోల్పోయింది.
అయితే ఈ టెస్టుకు ముందు ఉమేశ్ యాదవ్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతని తండ్రి తిలక్ యాదవ్ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే ఆ సమయంలో ఉమేశ్ యాదవ్ తన కుటుంబ సభ్యులతోనే ఉన్నాడు. మూడో టెస్టుకు కూడా అందుబాటులో ఉండడని వార్తలు వచ్చాయి. అయితే తన తండ్రి అంత్యక్రియలు ముగిసిన వెంటనే జట్టులో చేరాడు ఉమేశ్ యాదవ్. తండ్రిని కోల్పోయిన దుఃఖంలో కూడా నిప్పులు చెరిగే బంతులతో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించాడు ఉమేష్ యాదవ్. ఈక్రమంలో ఉమేశ్ యాదవ్ నిబద్ధతపై క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో మొత్తం 3 వికెట్లు తీసిన ఉమేశ్ స్వదేశంలో 100 వికెట్లు పడగొట్టిన 5వ పేసర్గా రికార్డులని సృష్టించాడు.
మరింత సమాచారం తెలుసుకోండి: