వైస్ కెప్టెన్సీ మాత్రమే కాదు.. కేఎల్ రాహుల్ కు మరో షాక్?
ఈ క్రమంలోనే వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్ పై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా మధ్య జరగబోయే వన్డే సిరీస్ కోసం జట్టును ప్రకటించగా ఇక వైస్ కెప్టెన్ గా అటు కేఎల్ రాహుల్ ను తొలగించింది. కొత్త వైస్ కెప్టెన్గా పాండ్యాకు బాధ్యతలు అప్పగించింది. అదే సమయంలో ఇక రెండు టెస్టులకు వైస్ కెప్టెన్ గా ఉన్న కే ఎల్ రాకుండా మిగతా రెండు టెస్ట్ లకు కూడా ఆ బాధ్యతల నుంచి తొలగించి రవీంద్ర జడేజా కు వైస్ కెప్టెన్సీ అప్పగించింది అని చెప్పాలి.
అయితే ముందుగా వైస్ కెప్టెన్ నుంచి తొలగించి కేఎల్ రాహుల్ కు షాక్ ఇచ్చిన బీసీసీఐ ఇక ఇప్పుడు అతన్ని జట్టు నుంచి పక్కన పెట్టేందుకు సిద్ధమవుతుంది అనేది తెలుస్తుంది. అతని స్థానంలో ప్రస్తుతం భీకరమైన ఫామ్ లో ఉన్న గిల్ కు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందట అయితే ఇక మిగిలిన రెండు టెస్టులకు సంబంధించి జట్టు ప్రకటనలో ఒక జయదేవ్ జట్టులోకి రావడం మిగతా ఎలాంటి మార్పులు లేవు. రెండు మ్యాచ్లలో టీమిండియా గెలిచిన నేపథ్యంలో ఎలాంటి మార్పులు లేకుండానే అటు మరోసారి అదే టీం బరిలోకి దిగిపోతుంది. అయితే తుది జట్టులో మాత్రం రాహుల్కు బదులు గిల్ కనిపించబోతున్నాడు అనేది తెలుస్తుంది.