మీరు ఆ సినిమా చూశారా.. షాకింగ్ కామెంట్స్ చేసిన క్రికెటర్?

praveen
బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తుంది అని చెప్పాలి. అయితే బీసీసీ నిర్వహిస్తున్న ఈ దేశీయ లీగ్ కారణంగానే అటు అంతర్జాతీయ టి20 లకు కూడా ఊహించిన రీతిలో పాపులారిటీ వచ్చింది అని చెప్పాలి. ఐపీఎల్ లో క్రికెట్ మజాని ఎంతగానో ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఇక అంతర్జాతీయ టి20 లను కూడా ఆదరించడం మొదలుపెట్టారు. అయితే ఇక బీసీసీఐ తరహాలోనే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ప్రస్తుతం తమ దేశ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో దేశీయ క్రికెట్ లీగులు నిర్వహిస్తూ ఉన్నాయి .

 అయితే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ఇక ఇలాంటి టి20 లీగ్లను నిర్వహిస్తూ ఉన్నప్పటికీ కొన్ని మాత్రమే సక్సెస్ అవుతూ ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటున్నాయి. ఇక మరికొన్ని లీగులు మాత్రం సక్సెస్ కాలేక ఇక నష్టాలనే తెచ్చి పెడుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలా ప్రేక్షకుల ఆదరణకు నోచుకొని టి20 లీగ్లలో ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ కూడా ఒకటి అని చెప్పాలి. ఇక ఇందులో ఆడేందుకు ఆటగాళ్లు కూడా పెద్దగా ఆసక్తి చూపరు అని చెప్పాలి. అయితే ఇక ఇటీవలే తమ దేశ క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న టి20 లీగ్ గురించి ఆ దేశ క్రికెటర్ షకీబ్ ఆల్ హసన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి.

 ఇక ఇటీవల అతను చేసిన షాకింగ్ కామెంట్స్ కాస్త సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి. ఇక సొంత దేశంలో సొంత క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న టి20 లీగ్ కు అసలు మార్కెట్ లేదు అంటూ అసహనం వ్యక్తం చేశాడు షాకీబ్ అల్ హసన్. మార్కెటింగ్ విషయంలో నిర్వాహకులు ఘోరంగా విఫలం అయ్యారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ తనను బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ కి సీఈవోగా నియమిస్తే వ్యవహారాలను సరిదిద్దడానికి పెద్ద సమయం కూడా అవసరం లేదంటూ చెప్పుకొచ్చాడు. మీరు నాయక్ సినిమా చూశారా ఒక్కరోజులో ఎంతో చేయవచ్చు అంటూ వ్యాఖ్యానించాడు షకీబ్ అల్ హసన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: