అప్పుడు 92 వేల మంది.. ఇప్పుడు మాత్రం గ్రౌండ్.. ఆలోచించాల్సిందే?
అయితే దేశీయ లీగులకు బాగా అలవాటు పడిపోయిన ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు ఇక ద్వైపాక్షిక సిరీస్లను చూడటం విషయంలో కూడా ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు అని చెప్పాలి. ప్రపంచకప్ జరిగినప్పుడు స్టేడియం మొత్తం నిండిపోయిన ప్రేక్షకులు.. ద్వైపాక్షిక సిరీస్ ల సమయంలో మాత్రం ఒక్కరు కూడా స్టేడియం కు వచ్చి మ్యాచ్ వీక్షించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు అని చెప్పాలి. ఇక ఇటీవల ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి.
ద్వైపాక్షిక సిరీస్ లకు రోజురోజుకీ ఆదరణ తగ్గుతుంది అన్నదానికి నిదర్శనంగా ఒక ఫోటోని తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. కొన్ని రోజుల క్రిందట ముగిసిన టి20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ టైటిల్ విజేతగా నిలిచింది. అయితే ఆ తర్వాత మూడు రోజులకే ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ జరిగింది. ఆడిలైట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్కు రావడానికి ప్రేక్షకులు ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. మైదానం మొత్తం ఖాళీగా కనిపించింది. అయితే ఇదే గ్రౌండ్లో నెల కిందట ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే 92,000 మంది ప్రేక్షకులు వచ్చారు. దీంతో మైదానం ఎక్కడ చూసినా కిక్కిరిసిపోయింది. దీనిపై నిజంగా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటూ షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించాడు.