టీమిండియా బౌలర్లు అరుదైన ఘనత.. ఇదే తొలిసారి?
ఇకపోతే ఇటీవలే మూడో మ్యాచ్ జరిగింది అని చెప్పాలి. అయితే మూడో మ్యాచ్లో భాగంగా అటు టీమ్ ఇండియా బౌలర్లు అద్భుతమే చేశారు. 130 పరుగుల వద్ద కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి భారీ స్కోరు దిశగా పయనించింది న్యూజిలాండ్ జట్టు. అలాంటి సమయంలోనే మరోసారి స్పెల్ వేయడానికి వచ్చిన మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్ లు తమ బౌలింగ్ తో అదరగొట్టారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇద్దరు కూడా చేరో నాలుగు వికెట్లు తీసుకొని న్యూజిలాండ్ జట్టును 160 పరుగులకు ఆల్ ఔట్ చేసేసారు. కేవలం 30 పరుగుల వ్యవది లోనే 8 వికెట్లు తీశారు. ఇక ఇద్దరు బౌలర్లు కూడా తమ కెరియర్ లోనే బెస్ట్ గణాంకాలు నమోదు చేశారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఈ క్రమంలోనే భారత బౌలింగ్ విభాగం ఒక అరుదైన ఘనతను సాధించింది అని చెప్పాలి. సిరాజ్ కంటే ముందు దీపక్ కూడా ఇదే సిరీస్ లో రెండో టి20 మ్యాచ్ లో పది పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఇక 2021 లో కూడా కోల్కతా వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో అక్షర పటేల్ తొమ్మిది పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయడం అత్యుత్తమ ప్రదర్శన కాగా.. ఇక ఇప్పుడు న్యూజిలాండ్తో టి20 మ్యాచ్లో టీమిండియా కు చెందిన ఇద్దరు బౌలర్లు చెరో నాలుగు వికెట్లు తీశారు అని చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఇదే అత్యుత్తమంగా కొనసాగుతోంది.