రికార్డు సృష్టించిన టీమిండియా.. ఇదే అతి పెద్ద విజయం?

praveen
ఇటీవలే ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్లో భాగంగా తీవ్రంగా నిరాశపరిచిన భారత జట్టు ఇక ఇప్పుడు ఏకంగా వచ్చే వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే జట్టులో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళింది అన్న విషయం తెలిసిందే. అయితే రెగ్యులర్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మకు విశ్రాంతి ప్రకటించడంలో ఇక యువ ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యాకు సారధ్య బాధ్యతలు  అప్పగించింది టీమిండియా యాజమాన్యం.
 ఇలా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగింది టీమిండియా జట్టు. అయితే మొదటి మ్యాచ్ వెల్లింగ్టన్ వేదికగా జరగాల్సి ఉన్నప్పటికీ వర్షం కారణంగా మొదటి మ్యాచ్ రద్దు అయింది అని చెప్పాలి.  అయితే రెండో మ్యాచ్ పై కూడా వర్ష ప్రభావం ఉన్నప్పటికీ ఎట్టకేలకు రెండో మ్యాచ్ జరిగింది. అయితే ఇక ఈ మ్యాచ్ లో భాగంగా అద్భుతంగా రాణించిన టీమ్ ఇండియా జట్టు  ఏకంగా న్యూజిలాండ్ జట్టును సొంత గడ్డపైనే 65 పరుగుల తేడాతో మట్టి కరిపించి  ఘనవిజయాన్ని అందుకుంది. దీంతో టీమ్ ఇండియా అభిమానులు అందరూ కూడా సంతోషంలో మునిగిపోయారు అని చెప్పాలి.

 ఇకపోతే ఇటీవల రెండో టి20 విజయం తర్వాత న్యూజిలాండ్ గడ్డమీద టీమిండియా ఒక అరుదైన రికార్డును సృష్టించింది అని చెప్పాలి. ఇటీవల జరిగిన టి20 మ్యాచ్ లో టీమిండియ 65 పరుగులు తేడాతో  విజయం సాధించగా.. ఇక ఇప్పటివరకు భారత జట్టుకు పరుగులపరంగా ఇదే అతి పెద్ద విజయం కావడం గమనార్హం. ఇక భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన పది టి20 మ్యాచ్ లలో భారత్ తొమ్మిది మ్యాచ్లో గెలిచింది.  2021 టీ20 వరల్డ్ కప్ లో మాత్రమే న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఓడిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: