టి20 వరల్డ్ కప్.. సెమీస్ లో అడుగుపెట్టిన తొలి జట్టు అదే?

praveen
టి20 వరల్డ్ కప్ లో భాగంగా గత కొన్ని రోజుల నుంచి సూపర్ 12 మ్యాచ్ లు ఎంత ఉత్కంఠ భరితంగా జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ కూడా నరాలు తెగ ఉత్కంఠ మధ్య జరుగుతూ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం సూపర్ 12 మ్యాచ్లు చివరి దశకు చేరుకున్నాయ్. దీంతో సెమీఫైనల్ లో అర్హత సాధించే జట్లు ఏవి అన్న విషయాన్ని తెలుసుకోవడానికి క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తికరంగా ఎదురుచూస్తుంది. ఇక ప్రతి వరల్డ్ కప్ లో లాగానే ఎలాంటి అంచనాలు లేకుండా బలిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు ఏడాది అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించింది.

 ఈ క్రమంలోనే వరుస విజయాలతో దూసుకుపోతూ అటు గ్రూప్ 2లో భాగంగా టాప్ లో కొనసాగిన న్యూజిలాండ్ జట్టు ఇక ఇటీవల ఈ ఏడాది వరల్డ్ కప్ లో భాగంగా సెమీఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న మొదటి జట్టుగా నిలిచింది అని చెప్పాలి. ఇటీవల టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. అందరూ ఊహించినట్లుగానే పసికూన ఐర్లాండ్ పై న్యూజిలాండ్ పూర్తి ఆధిపత్యాన్ని చలాయించింది. ఈ క్రమంలోనే ఐలాండ్ తో జరిగిన మ్యాచ్లో 35 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది న్యూజిలాండ్ జట్టు.

 తద్వారా న్యూజిలాండ్ జట్టు ఐదు మ్యాచ్ లలో ఏడు పాయింట్లు సాధించింది. అదే సమయంలో ఇక న్యూజిలాండ్ కు మరో జట్టు నుంచి ఎలాంటి పోటీ లేకపోవడం.. మెరుగైన రన్ రేట్ కూడా ఉండడంతో.. ఎలాంటి సమీకరణాలు లేకుండానే ఇక సెమి ఫైనల్ అవకాశాన్ని దక్కించుకుంది. కాగా ఐదు మ్యాచ్లలో కేవలం మూడు పాయింట్లు మాత్రమే సాధించిన ఐర్లాండ్ జట్టు సెమీఫైనల్ రేస్ నుంచి నిష్క్రమించింది అని చెప్పాలి. ఇలా మరోసారి ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్లో భాగంగా సెమీఫైనల్ లో అడుగుపెట్టిన మొదటి జట్టుగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: