కోహ్లీ ఇన్నింగ్స్ పై.. భార్య అనుష్క శర్మ ఏమందో తెలుసా?

praveen
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ గురించే మాట్లాడుకుంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా 50 పరుగులు కూడా చేయకుండానే టీమిండియా  కీలకమైన నాలుగు వికెట్లను కోల్పోయింది. ఇక అప్పటికే 10 ఓవర్లు పూర్తయ్యాయి.. ఈ క్రమంలోనే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది టీమిండియా. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ చేతిలో భారత్కు మరో ఓటమి ఖాయం అని భారత అభిమానులు కూడా డిసైడ్ అయ్యి నిరాశలో మునిగిపోయారు.

 అలాంటి సమయంలోనే అందరిలో సరికొత్త ఆశలు రేకెత్తించాడు విరాట్ కోహ్లీ. మొదట్లో ఎంతో నెమ్మదిగా ఆడిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత మాత్రం సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయాడు అని చెప్పాలి. 24 బంతుల తర్వాత గేర్ మార్చిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత 200 స్ట్రైక్ రేటు తో బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే 53 బంతులు 82 పరుగులు చేసి జట్టు విషయంలో కీలక పాత్ర వహించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా దక్కించుకున్నాడు. ఇక కోహ్లీ లేకపోతే టీమిండియా ఓడిపోయేది అని ఎంతో మంది అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

 ఇక తన ఇన్నింగ్స్ ని తలుచు కుంటూ విరాట్ కోహ్లీ కూడా మైదానంలో భావోద్వేగానికి గురయ్యాడు అన్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ గురించి కోహ్లీ భార్య అనుష్క శర్మ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.. దీపావళి సందర్భంగా ప్రజల జీవితాల్లో ఈరోజు రాత్రి ఆనందాన్ని తెచ్చాడని కోహ్లీని మెచ్చుకుంది  మీ ఆట చూస్తే గర్వంగా ఉంది.. నా జీవితంలో అత్యుత్తమమైన మ్యాచ్ ఇప్పుడే చూశాను. మునుపేన్నడు లేనంతగా బలంగా తెలివిగా ఆడావు నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా అంటూ ఒక పోస్ట్ పెట్టింది అనుష్క శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: