రేపు న్యూజిలాండ్ తో టీమిండియా మూడు మ్యాచ్ లు ఆడనుంది ..

 
న్యూజిలాండ్ పర్యటన లో భాగంగా  టీమిండియా రేపు  ఆతిథ్య జట్టు తో  మొదటి టీ 20 లో  తలపడనుంది. మరి  మరో రెండు మ్యాచ్ లు ఎక్కడివని అనుకుంటున్నారా..  అవును రేపు టీమిండియా, న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ లు ఆడనుంది. అదెలాగంటే..  5 మ్యాచ్ ల టీ 20ల సిరీస్ లో భాగంగా ఆక్లాండ్ వేదికగా  న్యూజిలాండ్ , భారత్ ల మధ్య అంతర్జాతీయ టీ 20మ్యాచ్ జరుగనుండగా  అదే రోజు న్యూజిలాండ్ ఏ , భారత్ ఏ జట్ల మధ్య రెండో అనధికార వన్డే మ్యాచ్ జరుగనుంది అలాగే అండర్ 19ప్రపంచ కప్ లో  భాగంగా రేపు టీమిండియా అండర్ 19 జట్టు  ,కివీస్ అండర్ 19 జట్టు తో తలపడనుంది. అలా  శుక్రవారం టీం ఇండియా ,న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ లు ఆడనుంది. 
ఇక ఇవే గాక  రేపు బంగ్లాదేశ్ , పాకిస్థాన్ ల మధ్య మూడు మ్యాచ్ ల టీ 20సిరీస్ ప్రారంభం కానుంది.  అందులో భాగంగా రేపు లాహోర్ వేదికగా  ఇరు జట్ల మధ్య మొదటి టీ 20మ్యాచ్ జరుగనుంది అలాగే  సౌతాఫ్రికా , ఇంగ్లాండ్ ల మధ్య  జోహనెస్ బర్గ్ లో నాల్గో టెస్ట్  కూడా రేపే ప్రారంభం కానుంది.  ఈ టెస్టు మ్యాచ్ తో సౌతాఫ్రికా  వెటరన్ ఫాస్ట్ బౌలర్  వెర్నర్ ఫిలాండర్  క్రికెట్ గుడ్ బై చెప్పనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: