భారత్ తో టీ 20 సిరీస్ కోసం అతన్ని ఎంపిక చేశారు

 

 

2020లో  మొట్ట మొదటగా  టీమిండియా, శ్రీలంక తో మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో  తలపడనుంది. ఇందుకోసం  శ్రీలంక జట్టు ,భారత్ లో పర్యటించాల్సి వుంది.  ఈ  సిరీస్ కు  శ్రీలంక క్రికెట్ బోర్డు , మలింగా నాయకత్వంలో   తమ   జట్టును ప్రకటించింది.  16 నెలలుగా  జట్టుకు దూరమైన మాజీ సారథి ఏంజెలో మాథ్యూస్‌ ను  ఈ సిరీస్ కు ఎంపిక చేశారు.  అతడు చివరిసారిగా 2018  ఆగస్టులో దక్షిణాఫ్రికా పై టీ 20 మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్ లో  మాథ్యూస్‌ డకౌట్ అయ్యాడు. ఇక  జనవరి 5 నుంచి భారత్‌తో సిరీస్‌ ఆరంభం కానుండగా  తొలి మ్యాచ్‌  గువాహటి లో జరగనుంది. గురువారం శ్రీలంక  జట్టు  భారత్‌కు చేరుకోనుంది. ఈ సిరీస్ ను గెలిచి ఈఏడాదిని ఘనంగా ఆరభించాలని టీమిండియా పట్టుదలతో వుంది. 

 

శ్రీలంక జట్టు : 

లసిత్‌ మలింగ (కెప్టెన్), దనుష్క గుణతిలక, అవిష్క ఫెర్నాండో, ఏంజెలో మాథ్యూస్‌, దసున్‌ శనక, కుశాల్‌ పెరీరా, నిరోషన్‌ డిక్వెలా, ధనంజయ డి సిల్వా, ఇసురు ఉదాన, భానుక రాజపక్స, ఒషాద ఫెర్నాండో, వనిందు హసరంగ, లాహిరు కుమార, కుశాల్‌ మెండిస్‌, లక్షణ్‌ సందకన్‌, కసున్‌ రజిత

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: