శోభనం గది నుండి పారిపోయి, నాకు మళ్ళీ పెళ్ళి చేయండి, సత్తా చాటుతా!" అన్న కేసిఆర్ తీరు

అసహ్యంగా అసభ్యంగా నోటికి హద్దూ అదుపు లేకుండా ప్రతిపక్ష నేతలను "సన్నాసులు దద్దమ్మలు" అంటూ నీచంగా మాట్లాడే "హీనాతి హీన సంస్కారి" "కుసంస్కారి" తెలంగాణా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అసలు తనది కాని అధికార పరిధిలో అదీ 'ఇండిపెండెంట్ కాన్స్టీ-ట్యూషనల్ బాడీ' చేయవలసిన పని కూడా ఈయనే చేశారు. అంటే కుక్క పని గాడిద చేసినట్లు

ఢిల్లీలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణతో కలిసి సురవరం సుధాకరరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, "ఎన్నికల కమిషన్‌" ను నిర్దేశించేలా కేసీఆర్‌ ప్రకటనలు చేస్తు న్నారు. ఎన్నికల షెడ్యూల్‌ ని కేసీఆర్‌ ప్రకటిస్తున్నారు. స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్‌ ను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎన్నికల తేదీలను కేసీఆర్‌ ప్రకటించడంపై మేం ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకొచ్చాం. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కేసీఆర్‌ ది కుటుంబ క్యాబినేట్‌. చర్చ లేకుండా రెండు నిమిషాల్లో శాసనసభ  రద్దు చేస్తూ మంత్రిమండలి తీర్మానం చేశారు. ఏక వ్యక్తి పార్టీ. పార్టీ పొలిట్‌-బ్యూరో తో సంబంధం లేకుండా 105 మంది అభ్యర్థుల పేర్లు విడుదల చేశారు’ అని సురవరం సుధాకరరెడ్డి విమర్శించారు .

మరో సీపీఐ నేత కంకణాల నారాయణ మాట్లాడుతూ, కేసీఆర్‌ లక్ష్మణ రేఖ దాటారని విమర్శించారు. కేసీఆర్‌ వ్యవహార శైలి పై ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారి విచారం వ్యక్తం చేశారని వెల్లడించారు. కేసీఆర్‌ తీరు చూస్తుంటే శోభనం గది నుంచి మధ్య రాత్రి పారిపోయిన పెళ్లి కొడుకు మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు తనకు మళ్లీ పెళ్లి చేయండి సత్తా చాటుతా అన్నట్లు ముందస్తు ఎన్నికల కోసం హడావుడి చేస్తున్నారని మండి పడ్డారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: