2019 ముఖ్యమంత్రి జగన్!
ఆంధ్రా ఆక్టోపస్ గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన రాజకీయాలలో క్రియాశీలకంగా లేకపోయినా సర్వేల పేరుతో వార్తల్లో వుంటూనే వున్నారు. లగడపాటి సర్వేలలో ప్రజలలో మంచి నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు ఆయన మరోసారి 2019 ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారు అనేదానిపై సర్వే చేయించినట్లు తెలుస్తోంది.
ఆయన సర్వే ప్రకారం ఈసారి 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని లగడపాటి రాజగోపాల్ ఇటీవల ఓ మీడియా ఛానల్ తో పంచుకున్నారు. వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాడే పటిమగల నాయకుడన్నారు.
ప్రజా సంకల్ప యాత్రతో వైఎస్ జగన్ తన శక్తిని మరింత పెంచుకుంటున్నారని, నాడు ఎన్టీయార్, వైఎస్ఆర్లు ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా పాలన అందించారని, ఇప్పుడు అలాంటి పాలననే వైఎస్ జగన్ అందించగలడని స్పష్టం చేశారు లగడపాటి రాజగోపాల్. ఈ నేపథ్యంలో లగడపాటి వ్యాఖ్యలు కన్నా కొంత మంది రాజకీయ నాయకులు తొందరలో లగడపాటి రాజగోపాల్ వైఎస్ఆర్ సీపీ పార్టీలో చేరుతారని అంటున్నారు.
ప్రస్తుతం లగడపాటి చేయించిన సర్వే ఫలితం వైసీపీ పార్టీ కార్యకర్తలను నాయకులను మంచి ఉత్సాహాన్ని నింపింది. ఏదేమయినా జగన్ పాదయాత్ర వైసిపి పార్టీకి మంచి మైలేజ్ ఇచ్చింది అని చెప్పవచ్చు.