వెస్ట్ బెంగాల్ లో తృణమూల్ కార్యకర్తల పోలింగ్ బూత్స్ ఆక్రమణ: 10 రాష్ట్రాల్లో పోలింగ్ కూల్:
పశ్చిమ బెంగాల్ సీపీఎం నేత, రాయ్గంజ్ లోక్సభ అభ్యర్థి మహ్మద్ సలీమ్ కారుపై దుండగులు దాడి చేశారు. పశ్చిమ బెంగాల్ ఇస్లామాపూర్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ రాళ్ల దాడి వెనుక టీఎంసీ హస్తం ఉందని సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు.
బీజేపీ ఎంపీ అభ్యర్థి కన్వర్ సింగ్ తన్వర్ అమోరాలో దొంగ ఓటింగ్ జరుగుతోందని ఆరోపించారు. బుర్కాలో ఉన్న వారిని పరీక్షించటం లేదని, మగవాళ్లు బుర్కాలో వచ్చి దొంగ ఓట్లు వేసినట్లు విన్నానన్నారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దారామయ్య మైసూర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తన కుటుంబ సభ్యులతో కలిసి క్యూలైన్లో నిలబడి, ఓటు హక్కును వినియోగించుకున్నారు.
లోక్ సభ ఎన్నికల రెండో దశలో మొత్తం 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 95 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు ఉదయమే వచ్చి ఓటు హక్కు వినియోగించు కుంటున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. ఐతే, అసోం లో ఈవీఎంలు మొరాయించడంతో అక్కడ పోలింగ్ ముందుకు సాగట్లేదు.