బుల్లిపిట్ట: ఈరోజు నుంచే వాట్సప్ కొత్త రూల్ అమలు..!

Divya
మనలో ప్రతి ఒక్కరూ తమ మొబైల్స్ లో కచ్చితంగా వాట్సప్ అనేది ఉపయోగిస్తున్నాం. మరి కొంతమంది ఒక ఫోన్ లో సిమ్ వేసి మరొక మొబైల్ లో వాట్సాప్ డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకునే వాళ్లు కూడా ఉన్నారు. అలా రెండు వాట్సప్ లను ఒకే మొబైల్ లో యూస్ చేస్తూ ఉండేవారు కూడా ఉన్నారు. కానీ ఇకమీదట అలా ఉపయోగించడం కుదరదట. ఏ మొబైల్లో రిజిస్టర్ సిమ్ ఉంటే అదే మొబైల్ లోనే వాట్సప్ పనిచేస్తుందని.. కేవలం వాట్సాప్ ఒక్కటే కాదు టెలిగ్రామ్, షేర్ చాట్, జియో చాట్ ,సిగ్నల్, జోష్ వంటి కమ్యూనికేషన్ యాప్ లన్ని కూడా సిమ్ బైండింగ్ నిబంధనతో పనిచేస్తాయట. ఈ రూల్ మార్చి ఒకటి నుంచే అమలవుతుంది.


ఇప్పటికే ఈ విషయం పైన గత ఏడాది నవంబర్ 28న డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ ఆదేశాలను కూడా జారీ చేసింది. ఈ ఆదేశాలను అమలు చేసుకోవడానికి 90 రోజులపాటు మెసేజింగ్ ప్లాట్ ఫామ్ లకు గడువు ఇచ్చింది. అయితే ఆ గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 28 తో పూర్తి అయ్యింది. దీంతో కొత్త నిబంధనలు ఆదివారం నుంచే ప్రారంభమవుతాయి. ఈ నిబంధనల ప్రకారం సిమ్ లేకుండా మొబైల్లో వాట్సప్ , మెసేజింగ్ యాప్స్ వంటివి ఉపయోగించలేరు. ఒకవేళ వాడుతున్న ఆ సేవలు నిలిచిపోతాయి.


మొబైల్ నుంచి సిమ్ తీసేసిన, స్వైపింగ్ చేసిన, డిఆక్టివేషన్ చేసిన కూడా ఈ యాప్స్ ఆగిపోతాయట. మళ్లీ ఒరిజినల్ సిమ్ వెరిఫికేషన్ చేసిన తర్వాతే మళ్ళీ అవి యాక్టివేషన్ అవుతాయని చెబుతున్నారు. ఇక కంప్యూటర్స్, ల్యాప్ టాప్స్, టెలిగ్రామ్ వంటివి కూడా ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్గా లాగౌట్ అవుతాయని, మళ్లీ తిరిగి యాక్టివేషన్ అవ్వాలి అంటే మొబైల్ తో  క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే యాక్టివేషన్ అవుతుందట. సైబర్ నేరగాళ్లు బారిన పడకుండా ఉండేందుకు, డిజిటల్ భద్రతకు ఉపయోగపడేలా ఈ నిబంధనను తీసుకువచ్చారని సమాచార శాఖ మంత్రి జ్యోతి రాదిత్య సింధియా  తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: