ఏపీ: విశాఖ ఉక్కు పై.. సంచలన ప్రకటన చేసిన ఎంపీ..!

Divya
గత కొన్ని ఏళ్లుగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణం అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ప్లాంట్ చుట్టూనే రాజకీయం గత కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పైన కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ అంటూ గతంలో విపక్షాలుగా ఉన్న టిడిపి పార్టీ చెప్పి అధికార పార్టీ వైసీపీని ఇరకాటంలో పెట్టేలా చేసింది. ఇప్పుడు ఇదే విషయాన్ని వైసిపి కూడా కూటమిని కార్నర్ చేసేలా కనిపిస్తోంది. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంపై వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.


ఆగస్టు 20న విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామిని ప్రశ్నించామని.. అందుకు  ఆయన సమాధానంగా ప్లాంట్ ను ఎక్కువకాలం నడపలేమని తెలిపారు. దీనిని బట్టి చూస్తే ఏదో ఒక రోజు కచ్చితంగా ప్లాంట్ ప్రైవేటీకరణం ఎప్పుడో ఒకరోజు జరిగే అవకాశం ఉందని తెలిపారు ఎంపీ గొల్లబాబు. అయితే ఈ విషయంలో మాత్రం వైసిపి పార్టీ చూస్తూ ఊరుకోదు.. విశాఖ ప్లాంట్ పై జాతీయస్థాయిలో కచ్చితంగా ఉద్యమిస్తామంటూ తెలిపారు ఎంపీ.


విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే ఒక చరిత్ర కలిగిందని ఎంతో మంది త్యాగాలు ఫలితంగానే ఈ ప్లాంట్  వచ్చిందని ఎంపీ గుర్తుకు చేశారు. ఈ ప్లాంట్ ప్రేవేటికరణమైతే ఉపాధి అవకాశాలు లేకుండా పోతాయని విశాఖ ప్రజలు నష్టపోతారంటూ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కచ్చితంగా ప్రైవేటీకరణ కాకుండా ఆపాల్సిన బాధ్యత కూటమి పెద్దల పైన ఉన్నదంటూ తెలియజేశారు. వీటికి తోడు చాలామంది వైసిపి నేతలు కూడా ఈ విషయం పైన డిమాండ్ చేశారు. విశాఖ ప్లాంట్ మీద ప్రైవేటీకరణ కత్తి వేలాడుతోందని కేంద్ర మంత్రి ఇచ్చిన జవాబుతోనే క్లారిటీ వచ్చింది.. ఇంకా లేటు చేస్తే ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ పూర్తి అయిపోతుందంటూ  ఎంపీ గొల్ల బాబురావు తెలిపారు. ఈ  విషయంపై కూటమి నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: