కేసీఆర్ సభ... సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీరియస్ ?
అయితే దాదాపు ఈ సభకు ఏడు నుంచి 8 లక్షల మంది వచ్చి ఉంటారు. ఈ సభ దేశంలోనే అతిపెద్ద సభగా రికార్డు కూడా సృష్టించింది. కెసిఆర్ సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో ఢిల్లీలో.... సీఎం రేవంత్ రెడ్డికి క్లాస్ పీకిందట కాంగ్రెస్ అధిష్టానం. అనవసరంగా కెసిఆర్ సభను కాంగ్రెస్ నేతలేపారని... అనవసరంగా సభను అడ్డుకునే ప్రయత్నం చేసి కేసీఆర్ ను హీరో చేశారని కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
కెసిఆర్ పేరును పదేపదే చెప్పి ఆయనను హీరో చేయడం తప్ప.... సాధించింది ఏమీ లేదని రేవంత్ రెడ్డికి కూడా చురకలు అందించారట కాంగ్రెస్ అధిష్టానం నాయకులు. ఈ మేరకు... మీనాక్షి నటరాజన్ కూడా క్లాస్ పీకినట్టు చెబుతున్నారు. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు... తెలంగాణ రాష్ట్రంలో.. మరో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారట కాంగ్రెస్ పెద్దలు. మరో ఈ భారీ బహిరంగ సభ పై క్లారిటీ ఇవ్వాలని కూడా చెప్పారట.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు