వైసీపీలో ఈయ‌న‌కు జ‌గ‌న్ పెద్ద న‌మ్మ‌క ద్రోహ‌మే చేశాడుగా...!

frame వైసీపీలో ఈయ‌న‌కు జ‌గ‌న్ పెద్ద న‌మ్మ‌క ద్రోహ‌మే చేశాడుగా...!

RAMAKRISHNA S.S.
ఏపీ శాసనమండలిలో వైసీపీకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మర్రి రాజశేఖర్‌ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మరో నాలుగేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ ఆయన రాజీనామా చేసేశారు. ఆ మాట‌కు వస్తే వైసీపీలో ఆయ‌న‌కు జ‌గ‌న్ అతి పెద్ద ద్రోహం చేశార‌నే చెప్పాలి. గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట నుంచి 2004 ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన రాజ‌శేఖ‌ర్ ఎమ్మెల్యేగా గెలిచి త‌ర్వాత కాంగ్రెస్ లో చేరారు. వైసీపీ ఆవిర్భావం త‌ర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉండ‌గానే త‌నుకున్న చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జ్ ప‌ద‌వి సైతం వ‌దులుకున్నారు. వైసీపీ లోకి వ‌చ్చి ఉమ్మ‌డి గుంటూరు జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా సుధీర్ఘ కాలం ప‌ని చేశారు.

2014 ఎన్నిక‌ల్లో పేట నుంచి వైసీపీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నిక‌ల వేళ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌నుకుంటోన్న టైంలో జ‌గ‌న్ టీడీపీ నుంచి వ‌చ్చిన విడ‌ద‌ల ర‌జ‌నీ కి సీటు ఇవ్వ‌గా సీటు వ‌దులుకున్న మ‌ర్రి కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ని చేసిన కేబినెట్లో త‌న ప‌క్క‌న కూర్చో పెట్టుకుంటాన‌ని జ‌గ‌న్ బ‌హిరంగంగా హామీ ఇచ్చారు. అయితే మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కుండా పైగా ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. మ‌ర్రికి ఎమ్మెల్సీ కూడా ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల ముందు అయిష్టంగా ఇచ్చారు.

మొన్న ఎన్నిక‌ల్లో ర‌జ‌నీని గుంటూరు ప‌శ్చిమంకు మార్చిన‌ప్పుడు కూడా రాజ‌శేఖ‌ర్‌కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తాన‌ని ఇవ్వలేదు. ఎన్నిక‌ల త‌ర్వాత అయినా రాజ‌శేఖ‌ర్ కు చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ఇస్తామ‌ని చెప్పి తిరిగి ర‌జ‌నీకే ఇన్‌చార్జ్ ఇచ్చారు. ఇలా వైసీపీ లో ప‌దే ప‌దే అవ‌మానాల‌తో పాటు జ‌గ‌న్ సైతం ద్రోహం చేయ‌డంతో వీటిని త‌ట్టుకోలేక ఆయ‌న పార్టీ మారి పోదామ‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న న‌ర‌సారావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవ‌రాయులు డైరెక్ష‌న్ లో టీడీపీలో చేరే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: