బాలయ్య షోలో చంద్రబాబు..సిగ్గుందా అంటూ రెచ్చిపోయిన రోజా ?

Veldandi Saikiran
బాలయ్య నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ షో కు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లడం పైన... ఏపీ మాజీమంత్రి రోజా విరుచుకుపడ్డారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యాచార ఆంధ్రప్రదేశ్  గా మారిన నేపథ్యంలో ఇలాంటి రియాల్టీ షోలు చేయడమేంటి...? అసలు చంద్రబాబుకు సిగ్గుందా  అంటూ రోజా ఫైర్ అయ్యారు.  తనలో ఉన్న పాత బూతులు బయటికి తీసుకువచ్చి రెచ్చిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా... చేసి హైదరాబాదులో తిరుగుతున్నారా...? అంటూ ఓ రేంజ్ లో  ఆడుకున్నారు మాజీ మంత్రి రోజా.
 

శుక్రవారం సాయంత్రం అయితే చాలు..  చంద్రబాబు కుటుంబ సభ్యులు మొత్తం హైదరాబాద్ కు వెళ్ళిపోతున్నారని చురకలాంటించారు. సీఎం చంద్రబాబు నాయుడు తో పాటు... నారా లోకేష్ హైదరాబాద్ లో రెండు రోజులు ఎంజాయ్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు వస్తున్నారని... శనివారం, ఆదివారం... హైదరాబాదులో గడుపుతున్నారని మండిపడ్డారు. అత్తా కోడలు,  తల్లి కూతుర్లు... అనే తేడా లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్నాయని... మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... మహిళలు బయట తిరగాలంటే గత గజ వణికి పోతున్నారని కూడా పేర్కొన్నారు. దీని అంతటికి ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కారణమని... దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఏపీలో ఇన్ని ఘోరాలు జరుగుతున్న నేపథ్యం లో... బావ మరిది బాలయ్య... రియాల్టీ షోకు చంద్రబాబు ఎందుకు వెళ్లాడని నిలదీశారు.
 ఏపీ ప్రజలు కష్టాలు పడుతుంటే... ముఖానికి పౌడర్ రాసుకొని... రియాల్టీ షోలు చేస్తున్నారని.. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసమర్థం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... డిప్యూటీ ముఖ్యమంత్రి అలాగే హోమ్ మినిస్టర్ అనిత... కారణంగా ఆంధ్రప్రదేశ్ ఇలా తయారయిందని ఆగ్రహించారు. బద్వేల్ నియోజకవర్గం లో బాలికపై దారుణం జరిగితే ఆ కుటుంబానికి... భరోసా చెప్పే నాయకుడే లేడని మండిపడ్డారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: