పవన్ ను అదుపులో పెట్టు....లేకపోతే చిరంజీవి అంతు చూస్తాం?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. సనాతన ధర్మం గురించి చేస్తున్న వ్యాఖ్యలు.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. సనాతన ధర్మం.. మలేరియా అలాగే డెంగ్యూ లాంటిదని తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిది స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ మరి పవన్ కళ్యాణ్...రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఈ వివాదం.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లను నేపథ్యంలో... తమిళనాడు రాజకీయాలు అట్టడుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ పై వరుసగా..  కేసులు పెడుతున్నారు తమిళనాడు వాసులు.  ఇప్పటికే పవన్ కళ్యాణ్ పైమధురైలో ఓ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు అయింది. తమిళనాడు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విధ్వంస రాజకీయాలకు పవన్ కళ్యాణ్ తెర లేపుతున్నారని కేసు పెట్టారు ఓ ప్రముఖ లాయర్.

అలాగే హిందుత్వ రాజకీయాలను కూడా.. తెరపైకి తీసుకువచ్చి మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని పవన్ కళ్యాణ్ పై కేసులు పెట్టారు. అయితే.. ఇక్కడితో ఆగకుండా తమిళనాడుకు సంబంధించిన కొంతమంది... మెగాస్టార్ చిరంజీవికి కూడా వార్నింగ్ ఇస్తున్నారు. నీ తమ్ముడు పవన్ కళ్యాణ్ ను అదుపులో పెట్టుకోకపోతే.. నీ అంతు చూస్తామని..  సోషల్ మీడియాలో స్టాలిన్ అనుచరులు, ఆయన ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.

స్టాలిన్తో చిరంజీవి దిగిన ఫోటోలను షేర్ చేసి మరి... చిరంజీవికి ట్యాగ్ చేసి హెచ్చరికలు జారీచేస్తున్నారు. వెంటనే ఈ సనాతన ధర్మం పైన... పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాల్సిందేనని.. లేకపోతే మేము తగ్గేది లేదంటూ.. సోషల్ మీడియా వేదికగానే వార్నింగ్ లు ఇస్తున్నారు.  ఇంకా ఇటు ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తగ్గేదే లేదని... హిందుత్వం కోసం ఎక్కడికైనా పోరాటం చేస్తానని చెబుతున్నారు. బిజెపి నాయకులకు అంటే ఎక్కువగా హిందుత్వవాదిగా పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతూ.. ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. అభివృద్ధి పైన దృష్టి పెట్టకుండా.. ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా చేసి పవన్ కళ్యాణ్ హాట్ టాపిక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: