టీవీ 5 సాంబ‌డు, వెంక‌ట‌కృష్ణ‌, రాధాకృష్ణ‌, మ‌హా వంశీ అంతు చూస్తా.. రెచ్చిపోయిన విజ‌య‌సాయి..?

Veldandi Saikiran
ఏపీ అధికారి శాంతి ఎపిసోడ్‌ లో తనపై వచ్చిన ఆరోపణలపై ఖండించారు రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి. ఏపీ అధికారి శాంతి, రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు ABN, TV5, మహా ఛానెల్స్‌ నిన్నటి నుంచి విపరీతంగా ప్రసారాలు చేశాయి. ఈ సందర్భంగా ABN, TV5, మహా ఛానెల్ ల పై మండి పడ్డారు విజయ సాయి రెడ్డి. టీవీ 5 సాంబ‌డు, వెంక‌ట‌కృష్ణ‌, రాధాకృష్ణ‌, మ‌హా వంశీ అంతు చూస్తానంటూ రెచ్చిపోయారు విజ‌య‌సాయి. జర్నలిస్టులు ఎవరైనా... తనపై తప్పుడు ప్రచారం చేస్తే... వారి అంతు చూస్తానని హెచ్చరించారు.
ఒరేయ్ వంశీ కృష్ణ, వెంకట్ కృష్ణ, TV5 సాంబాడు మీ పుట్టక తేడా రా అంటూ రెచ్చిపోయారు సాయిరెడ్డి. త్వరలోనే న్యూస్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానని... గతంలోనే ప్రకటించిన ఆలస్యం చేసినందుకు బాధపడుతున్నానన్నారు విజయసాయిరెడ్డి. ఎవరు అడ్డువచ్చిన ఛానల్ ఏర్పాటు లో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. కులాలు, మతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా న్యూట్రల్ ప్లాట్ ఫార్మ్ మీద పని చేస్తుందన్నారు విజయసాయిరెడ్డి. తప్పులు చేసే వాళ్ళను వదలబోమని హెచ్చరించారు.
ప్రజల అవసరాల కోసం, ప్రభుత్వ అస్తుల రక్షణ కోసం పనిచేశానని తెలిపారు. ఎటువంటి చర్యలకు అయిన సిద్ధమన్నారు. మదన్ మోహన్ అనే వ్యక్తి రెండు సార్లు నా దగ్గరకు వచ్చాడు....స్కాలర్ షిప్ కోసం వస్తే సహకరించాననని క్లారిటీ ఇచ్చారు. ఆరోపణలు చేస్తే వస్తాయన్నారు. శాంతితో సంబంధం ఉందని తప్పుడు ఆరోపణలు చేశారని ఆగ్రహించారు.
పార్లమెంటు లో ప్రివిలేజ్ మోషన్ తో పాటు చట్ట బద్ధమైన అన్ని సంస్థలకు ఫిర్యాదులు చేస్తానని హెచ్చరించారు.  పరువు నష్టం దావా వేసి న్యాయపోరాటం చేస్తానని తెలిపారు రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి. సాయిరెడ్డి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించే మనిషి కాదని...తప్పు చేయను వేంకటేశ్వర స్వామికి తప్ప ఎవ్వరికీ భయపడనని తెలిపారు రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: