అంబానీ ఇంటికి జగన్.. వైసీపీ అదిరిపోయే స్కెచ్ ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... వైయస్ జగన్మోహన్ రెడ్డి..  ప్రస్తుతం కామ్ గా ఉంటున్నారు. మొన్నటి వరకు బెంగళూరు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ...  తాడేపల్లి చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఓటమిపై విశ్లేషణ చేస్తున్నారు. మళ్లీ ఎలా ముందుకు వెళ్లాలి అనేదానిపై కూడా... నేతలతో... సమావేశం అవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే... ఆ ముఖేష్ అంబానీ ని కలిసేందుకు  జగన్మోహన్ రెడ్డి... సిద్ధమయ్యారట.

ముఖేష్ అంబానీ ఇంటికి... జగన్మోహన్ రెడ్డి ఇవాళ వెళ్ళనున్నారు. ముఖేష్ అంబానీ అలాగే నీతో అంబానీ రా చిన్న కుమారుడు అనంత్ అంబానీ... పెళ్లి ఇవ్వాళ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుకలకు... చాలామంది ప్రముఖులు వస్తున్నారు. వివాహ వేదిక వద్దకు... అతిధులు వచ్చేందుకు... దాదాపు 100 విమానాలను కూడా ఏర్పాటు చేశారట. అత్యంత గ్రాండ్ గా అనంత అంబానీ వివాహం జరుగుతోంది.
అయితే... ఈ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక జగన్మోహన్ రెడ్డికి కూడా అందింది. దీంతో.. ఇవాళ ఈ వివాహానికి జగన్ మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. వైసిపి పార్టీ దీనిపై అధికారికంగా ప్రకటించినప్పటికీ... జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు మాత్రం ఈ విషయాన్ని స్పష్టం చేశారు.  ముఖేష్ అంబానీ తో జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలే ఉన్నాయి. గతంలో... ముఖేష్ అంబానీ సన్నిహితుడికి... రాజ్యసభ టికెట్ కూడా ఇచ్చారు  వైఎస్ జగన్.

అప్పటినుంచి... అమ్మకేష్ అంబానీ అలాగే జగన్మోహన్ రెడ్డి మధ్య సంబంధాలు మరింత పెరిగాయి. ఇందులో భాగంగానే.. అంబానీ  కొడుకు పెళ్లి కి జగన్ మోహన్ రెడ్డి వెళ్తున్నారట. ఇక ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లికి... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారని సమాచారం. అటు తెలంగాణ నుంచి కూడా ప్రముఖ నాయకులు వస్తున్నారు. ప్రధాని మోడీ కూడా ఈ పెళ్లికి హాజరు కానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: