పసిపాపపై అడల్ట్ జోక్స్! యూట్యూబర్ పై టీజి పోలీస్ సీరియస్?

Purushottham Vinay
స్నేహితులతో వీడియో చాటింగ్ చేస్తూ తండ్రీకూతుళ్ల బంధంపై సిగ్గులేకుండా కల్లూమూసుకొని పోయి మానవత్వం మరిచి విచక్షణ మరిచి మాట్లాడాడు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు. పూర్తిగా సంస్కారం మరిచి, విజ్ఞత విడిచి పసి పాప గురించి అత్యంత అసభ్యకర మాటలతో రెచ్చిపోయాడు ఈ వెధవ. తండ్రీ కుమార్తె బంధంలో కూడా అశ్లీలం ధ్వనించేటంత పైత్యం కలిగి వీడు మాట్లాడిన తీరు తెలుగు జాతికి సిగ్గు చేటు.వీడిని వీడి ఫ్రెండ్స్ ని ఎలాగైన ఖచ్చితంగా శిక్షించాలంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అవుతుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో టీజీ పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగారని తెలుస్తుంది.సంస్కారం, విజ్ఞత మరిచినట్లుగా తండ్రీ కూతుళ్లపై అసభ్యకర మాటలతో రెచ్చిపోయాడు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై సినీ నటుడు సాయిధరం తేజ్ ఇంకా మంచు మనోజ్ లు ఎక్స్ వేదికగా స్పందించారు.


ఇలాంటి వారిపై ఖచ్చితంగా సీరియస్ గా చర్యలు తీసుకోవాలని కోరుతూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ట్యాగ్ చేశారు.ఈ నేపథ్యంలో స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలకు వెంటనే ఆదేశించారు. దీంతో వీడిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో వీడు వీడి స్నేహితులు ఏపీకి చెందినవారిగా గుర్తించారని తెలుస్తుంది. వారిలో కీలక నిందితుడు అయిన ప్రణీత్ హనుమంతు ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు నిర్థారించారని తెలుస్తుంది.ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్న ప్రణీత్ తో పాటు ఆ వీడియోలో ఉన్న బ్యాచ్ మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారని సమాచారం తెలుస్తోంది. ఇదే సమయంలో వారిపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క.. వారిపట్ల ప్రభుత్వం ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: