ఆ ఒక్క పని చేస్తే చంద్రబాబు దేవుడు అవుతాడు.. ఆ దిశగా అడుగులు పడతాయా?

Reddy P Rajasekhar

ఏపీలో రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు ప్రతి నెలా రేషన్ సరుకులలో బియ్యం తప్ప ఏమీ అందడం లేదనే సంగతి తెలిసిందే. రేషన్ కార్డ్ లబ్ధిదారులకు కందిపప్పు, ఇతర నిత్యావసర వస్తువులు కూడా అందితే వాళ్లకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు బియ్యం, కిరోసిన్, కందిపప్పు, పామాయిల్, ఇతర నిత్యావసర వస్తువులను సైతం అందించేవారు.
 
ఆ సమయంలో మార్కెట్ లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా ప్రజలపై పెద్దగా ప్రభావం పడేది కాదు. అయితే ఇప్పుడు మాత్రం నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. మార్కెట్ లో ఏమీ కొనేలా తినేలా లేవని సామాన్య ప్రజల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితిని చంద్రబాబు కొంతమేర మార్చినా బాగుంటుందని చెప్పవచ్చు.
 
చంద్రబాబు పాలనపై ఏపీ ప్రజలు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తాడనే నమ్మకంతో ఆయనకు ప్రజలు పట్టం కట్టారు. చెప్పిన హామీలతో పాటు చెప్పని హామీలను సైతం అమలు చేస్తే ఆయన దేవుడు అవుతారని కామెంట్లు వినిపిస్తున్నాయి. చెప్పిన హామీలతో పాటు చెప్పని హామీలను సైతం నెరవేరిస్తే కచ్చితంగా చంద్రబాబుకు మరింత మంచి పేరు వస్తుంది.
 
చంద్రబాబు నాయుడు త్వరలో మరికొన్ని హామీల అమలుతో ప్రజలను మెప్పిస్తే బాగుంటుందని చెప్పవచ్చు. చంద్రబాబు 25 రోజుల పాలనకు ఇప్పటివరకు మంచి మార్కులు పడ్డాయి. చంద్రబాబు రాబోయే రోజుల్లో ఏపీ అభివృద్ధితో ప్రజలకు మరింత దగ్గర కావడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉండటం చంద్రబాబుకు మరింత ప్లస్ అవుతోందని చెప్పవచ్చు. చంద్రబాబు జులై 1వ తేదీన 7,000 రూపాయల ఫించన్ పంపిణీ చేయనున్న నేపథ్యంలో వృద్ధులు, వితంతువులు బాబును ఎంతో మెచ్చుకుంటున్నారు. బిడ్డలా బాబు తమకు అండగా నిలబడుతున్నారని వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: