జగన్‌ ఇంటిని కూల్చడం వెనుక తెలంగాణ మంత్రి కుట్రలు ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... వైసిపి పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయింది. ఈ ఓటమి బాధలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. లోటస్ పాండ్ వద్ద ఉన్న జగన్మోహన్ ఇంటిని కూల్చే పనిలో పడింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రోడ్డుకు అడ్డంగా ఉందని... జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న కొన్ని ప్రత్యేకమైన గదులను కూల్చివేసింది జిహెచ్ఎంసి.

ఎలాంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండానే... దౌర్జన్యంగా పోలీసు అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేతలు మొదలుపెట్టింది. అక్కడ వైసిపి పార్టీకి చెందినవారు అడ్డు చెప్పినా కూడా వినకుండా జిహెచ్ఎంసి అధికారులు... గదులను కూల్చివేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇంటిని కూల్చివేసిన సంఘటనలో... కొత్త అంశం తెరపైకి వచ్చింది. వాస్తవానికి... జగన్మోహన్ రెడ్డి ఇంటిని కూల్చే విషయం... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదట.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి పెద్ద నాయకుడికి సంబంధించిన ఏ విషయమైనా... మొదటగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కచ్చితంగా తెలియాలి. కానీ ఎలాంటి సమాచారం లేకుండానే... జిహెచ్ఎంసి అధికారులు రంగంలోకి దిగి... జగన్ ఇంటి దగ్గర రచ్చ చేశారు. అయితే ఈ సంఘటన వెనుక.. కాంగ్రెస్ సీనియర్ నేత, దక్షిణ తెలంగాణకు చెందిన ఓ కీలక తెలంగాణ మంత్రి ఉన్నారట.

ఆ తెలంగాణ మంత్రి.. కుట్రలు చేసి... జిహెచ్ఎంసి కీలక అధికారులకు ఆదేశాలు ఇచ్చారట. ఈ తరుణంలోనే... సీఎం రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకోకుండా జిహెచ్ఎంసి అధికారులు.... జగన్మోహన్ రెడ్డికి ఇంటికి సంబంధించిన... కొన్ని గదులను కూల్చేశారు. దీంతో ఆ తెలంగాణ మంత్రి ఎవరు అనే దానిపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడుతో ఆ తెలంగాణ మంత్రి జట్టు కట్టి...ఈ కుట్రలు చేశాడని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: