తెలుగుభాష ప్రాముఖ్య‌త‌ను పెంచేందుకు రామోజీరావు చేసిన కృషి అంతా ఇంత కాదు?

Purushottham Vinay
ఈనాడు గ్రూప్‌ సంస్థల చైర్మన్ రామోజీరావు(88) మృతిచెందారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం నాడు తెల్లవారుజామున 4.50 ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.ఇక ఈ విషాద వార్తను తెలుసుకున్న ప్రముఖుల ఆయన మృతిపై సంతాపం తెలుపుతున్నారు. కాగా రామోజీరావు..1936 నవంబర్‌ 16న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పెదపారుపూడి లో రామోజీరావు జన్మించారు. 1974 ఆగస్టు 10 వ తేదీన విశాఖ తీరంలో 'ఈనాడు' దినపత్రికను రామోజీరావు ప్రారంభించారు. ఇక రామోజీరావు తెలుగు పత్రికా రంగంలో విప్లవం తీసుకొచ్చిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు. ఆయన కృషి వల్లే నేడు తెలుగు పత్రికకి ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. మొదట 5000 ప్రతులతో ఈనాడు ప్రస్థానాన్ని మొదలు పెట్టిన రామోజీ రావు అంచెలంచెలుగా ఎదిగి తెలుగోడి సత్తా ఏంటో ప్రపంచానికి చూపించారు. 1995 వ సంవత్సరం లో ఈ టీవీ ఛానల్ ను స్టార్ట్ చేశారు.


2003 వ సంవత్సరం లో టీటీవీ-2 పేరిటీ తెలుగు రాష్ట్రాల్లో 24 గంటల వార్తా ఛానల్ ను రామోజీ రావు పరిచయం చేశారు. ఇంకా అలాగే 2014 రాష్ట్ర విభజన తర్వాత ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ వంటి మార్పులు కూడా రామోజీరావు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈటీవీ, ఈనాడు అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాయి. ఇవి వార్తలకు బ్రాండ్ గా నిలిచాయి. ఎన్ని చానళ్ళు, పత్రికలు వచ్చినా కూడా వీటికి ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. వీటిని మించేవి అసలు లేనే లేవని చెప్పాలి. మీడియా బాగా అభివృద్ధి చెందిన ఈరోజుల్లో ఈటీవీ, ఈనాడు... ఇప్పటికీ కూడా ఈ రెండింటిలో వస్తే తప్ప వార్తలను నమ్మలేమని చెప్పే వారు కూడా ఉన్నారంటే ఈనాడు గ్రూప్స్ ప్రజల్లో ఎంత నమ్మకం సాధించిందో.. ప్రజలు ఈనాడు గ్రూప్స్ పై ఏ రేంజ్ నమ్మకం పెట్టుకున్నారో పూర్తిగా అర్థమవుతుంది. ఇలా తెలుగు మీడియా రంగాన్ని బలంగా పెంచి అందుకు కృషిన మహానుభావుడు మన రామోజీరావు.తెలుగు భాష ప్రాముఖ్య‌త‌ను పెంచేందుకు రామోజీరావు చాలా కృషి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: