విశాఖ - పార్లమెంట్: బాలయ్య అల్లుడా మజాకా! భరత్ అదరగొట్టేశాడు!
ఆమె మహిళా అభ్యర్ధి కావడం, విద్యావంతురాలు కావడం, వైసీపీ సంక్షేమ పథకాల బలం వంటివి ఆమెను గెలిపిస్తాయని వైసీపీ ఎన్నో ఆశలే పెట్టుకుంది. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పూర్తిగా అడ్డుకోలేకపోవడం, నగరంలో స్థానికంగా కీలక నేతలు వైసీపీని వీడి టీడీపీ ఇంకా జనసేనలోకి వెళ్లిపోవడం వంటి పరిణామాలు ఝాన్సీకి పెద్ద మైనస్ గా మారాయి.ఇంకా అదే సమయంలో పూర్తిగా అర్బన్ పరిధిలో ఉన్న విశాఖ లోక్ సభ ఓటు బ్యాంక్ టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన కూటమికి బాగా కలిసి వచ్చింది.ఇంకా అలాగే నగరంలో టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు కూడా అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తుండటం, గతంలో వైసీపీ వేవ్ లో కూడా నగరంలో టీడీపీ సత్తా చాటుకున్న చరిత్ర కూటమికి ప్లస్ అయ్యాయి. ఇంకా అలాగే గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి టీడీపీ అభ్యర్ధి మతుకుమిల్లి భరత్ కు బాగా కలిసి వచ్చాయి.గీతం మూర్తి మనవడు, బాలకృష్ణ చిన్న అల్లుడైన భరత్ యువకుడు, విద్యావంతుడు కావడం, క్లీన్ ఇమేజ్ ఈసారి ఆయన ఏకంగా 907467 ఓట్లు గెలిచి వైసీపీని చిత్తు చేశాడు. బొత్సా ఝాన్సీ 403220 ఓట్లు మాత్రమే గెలిచి ఓడిపోయింది.