అకీరాతో చంద్రబాబు ఇంట్రెస్టింగ్ ఇంట్రాక్షన్.. భార్య అనాతో ఫొటో??

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నిలబడ్డ ప్రతి చోటా గెలిచి సంచలనం సృష్టించింది. గెలిచిన తర్వాత చంద్రబాబు జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు పై మంతనాలు జరిపారు. ఇక్కడ ఒక ఆసక్తికర విషయం చోటు చేసుకుంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తనయుడు అకీరా నందన్ కూడా ఆఫీస్ లోనే ఉన్నాడు. చంద్రబాబుతో అకిరా ఇంట్రెస్టింగ్ ఇంటరాక్షన్ జరిగింది. అకిరా చంద్రబాబు పాదాలపై పడి ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి చంద్రబాబు తాజాగా వెళ్లారు. పవన్‌ చంద్రబాబుకు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పి శాలువాతో సత్కరించారు. తర్వాత ఒకరికి ఒకరు కంగ్రాట్యులేషన్స్ చెప్పుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ప్రమాణస్వీకారానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి గంటకు పైగా మాట్లాడినట్లు సమాచారం.  ఇదే సమయంలో పవన్ భార్య కొణిదెల అన్నా లెజినోవా, కొణిదెల అకిరా నందన్ లతో చంద్రబాబు కాసేపు ముచ్చటించారు. అకిరా నందన్ చంద్రబాబు ఆశీర్వాధం తీసుకోగా.. వీరందరూ కలిసి చంద్రబాబుతో ఒక ఫొటో కూడా దిగారు.
ఎన్‌డీఏ మీటింగ్ కు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తదితర కీలక నేతలు త్వరలో హాజరు కావాల్సి ఉంది.

 దీనిపై కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. టీడీపీ కూటమి ఆంధ్రప్రదేశ్ లో భారీ విజయం సాధించింది కానీ ఎన్‌డీఏ కేంద్రంలో స్వల్ప మెజారిటీతోనే విజయం సాధించింది. పోయినసారి తో పోల్చుకుంటే ఈసారి 100కు పైగా అన్ని సీట్లు తగ్గాయి. ఉత్తరప్రదేశ్ మోదీకి బాగా హ్యాండిచ్చింది. భారతదేశంలో కూడా ఆయనపై వ్యతిరేకత కనిపించింది. చంద్రబాబు ఎంపీ సీట్లను బాగానే గెలుచుకోగలిగారు. పవన్ కళ్యాణ్ కూడా రెండు ఎంపీ సీట్లను సాధించారు. కేంద్రంలో అధికారంలో ఉండాలంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ల అవసరం మోదీకి ఎంతైనా ఉంటుంది అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: