మైల‌వ‌రం : చెప్పి మ‌రీ జ‌గ‌న్ తుప్పు రేపిన వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌..!

RAMAKRISHNA S.S.
ఏపీలోనే అత్యంత ఆస‌క్తి రేపిన నియోజ‌క‌వ‌ర్గాల్లో కృష్ణా జిల్లాలోని మైల‌వ‌రం ఒక‌టి. ప‌శ్చిమ కృష్ణా లో విజ‌య‌వాడ న‌గ‌రానికి ఆనుకున్న ఉన్న మైల‌వ‌రంలో మైల‌వ‌రం, జి. కొండూరు , రెడ్డిగూడెం, ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లాల‌తో పాటు ఇబ్ర‌హీంప‌ట్నం - కొండ‌ప‌ల్లి మున్సిపాల్టీ.. విజ‌య‌వాడ రూర‌ల్ మండ‌లంలోని గొల్ల‌పూడితో పాటు కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఇక్క‌డ నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ పోటీ చేశారు. జ‌గ‌న్ ఎంత బ‌తిమిలాడినా కృష్ణ‌ప్ర‌సాద్ పార్టీ వీడి టీడీపీ నుంచి పోటీ చేయ‌డం ఆయ‌న‌కు న‌చ్చ‌లేదు. దీంతో కృష్ణ ప్ర‌సాద్‌ను ఎలాగైనా ఓడించాల‌ని జ‌గ‌న్‌తో పాటు వైసీపీ పెద్ద‌లు ఈ ఎన్నిక‌ల్లో క‌సితో ప‌నిచేశారు. కృష్ణ ప్ర‌సాద్ పై ఓ సామాన్యుడిని నిల‌బెట్టి గెలిపించాల‌ని జ‌గ‌న్ కంక‌ణం క‌ట్టుకున్నారు.

అందుకే జ‌గ‌న్ ప‌ని క‌ట్టుకుని మైల‌వ‌రం జ‌డ్పీటీసీ గా ఉన్న స‌ర్నాల తిరుప‌తిరావు యాద‌వ్‌కు సీటు ఇచ్చారు. తిరుప‌తి రావు అతి సామాన్య కార్య‌క‌ర్త‌.. ఆయ‌న్ను కృష్ణ ప్ర‌సాదే జ‌డ్పీటీసీగా గెలిపించారు. అయితే జ‌గ‌న్ అలాంటి వ్య‌క్తికి సీటు ఇవ్వ‌డంతో పాటు ఆర్థిక‌, అండ బ‌లాలు పుష్క‌లంగా అందించారు. త‌న‌ను కాద‌ని బ‌య‌ట‌కు వెళ్లిన కృష్ణ ప్ర‌సాద్‌పై ఓ సామాన్యుడిని నిల‌బెట్టి ఎమ్మెల్యేను చేశాన‌న్న ఘ‌న‌త త‌న‌కు ద‌క్కాల‌న్న‌దే జ‌గ‌న్ పంతంగా క‌నిపించింది. తిరుప‌తిరావు బీసీల్లో యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. బీసీ ఓట‌ర్ల‌తో పాట‌గు వైసీపీ సంప్ర‌దాయ ఓట‌ర్ల‌ను ఏకం చేసి ఇక్క‌డ కృష్ణ ప్ర‌సాద్‌ను దెబ్బ కొట్టాల‌న్న‌దే జ‌గ‌న్ ప్లాన్‌గా కనిపించింది.

అయితే అటు కృష్ణ ప్ర‌సాద్ పార్టీ మారినా వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న మంచి వాడే అన్న పేరుంది. పైగా ఫైనాన్షియ‌ల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా వ‌ర్గం కూడా బాగా క‌లిసి వ‌చ్చింది. టీడీపీ ధ‌నికుడు... వ‌ర్సెస్ వైసీపీ సామాన్యుడు మ‌ధ్య హెరాహోరీ పోరు ఉంటుంద‌నుకున్న మైల‌వ‌రంలో ఫైన‌ల్ గా జ‌గ‌న్‌ను కాద‌ని మ‌రి పార్టీ వీడి టీడీపీలో చేరిన వ‌సంత జ‌గ‌న్ తుప్పు రేపి ప‌డేశాడు. ఏకంగా 42829 ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. అస‌లు ఇది మామూలు విజ‌యం కాద‌ని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: