ఏపీ ఎగ్జిట్ పోల్స్ 2024: నిజమవుతాయా.. ఫలితాలు ఇలానే ఉంటాయా..?

Divya
ఎప్పుడెప్పుడా అంటు రాజకీయ నాయకులు ప్రజలు ఎంత ఆతృతగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ నిన్నటి రోజున సాయంత్రం రానే వచ్చింది.. అయితే అటు దేశంలో ఇటు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ ఎన్నికల ఫలితాల పైన చాలా సర్వేలు సైతం తమ తమ ఎగ్జిట్ పోలీసులను విడుదల చేశాయి.. ఎక్కడ ఎవరు అధికారంలోకి వస్తారని ఏ పార్టీ ఎన్ని సీట్లు వస్తాయని ఓడిపోయే దేవరనే విషయం పైన కూడా పలు రకాల సంస్థలు అంచనా వేసి మరి తెలియజేసాయి.

కేంద్రంలో మరొకసారి ఎన్డీఏ ప్రభుత్వం భారీ మెజారిటీతో వస్తుందంటూ ఎన్నో సంస్థలు తెలియజేశాయి. తెలంగాణలో బిజెపి కాంగ్రెస్ పార్టీలకు ఎక్కువ ఎంపి స్థానాలు వస్తాయంటూ కూడా తేల్చడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎగ్జిట్ పోల్స్ చాలా ఉత్కంఠాన్ని పెంచేలా చేస్తున్నాయి. ఎందుకంటే కొన్ని సర్వే సంస్థలు వైసిపిదే అధికారం అంటూ చెప్పగా మరికొన్ని మాత్రం కూటమి అని తెలియజేస్తున్నారు. దీంతో ఏపీలోని మరొకసారి ప్రజలు టెన్షన్ పడుతూ పిచ్చెక్కిఎలా కనిపిస్తున్నారు.

ముఖ్యంగా బెట్టింగ్ రాయుళ్లు కూడా ఈ విషయం పైన చాలా సతమతమవుతున్నారు.ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందనే విషయం ఇప్పుడు మరొకసారి హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇదంతా ఇలా ఉండగా పలు జాతీయ సంస్థలు స్థానిక సర్వే సంస్థలు చెప్పినట్టుగానే తృతీయ ఫలితాలు ఉంటాయా  లేదనే విషయం ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుతం అన్ని ఫలితాలు కూడా 94 నుంచి 100 లోపల చెబుతున్నాయి.. ఎందుకంటే ఇది మ్యాజిక్ ఫిగర్ కాదు టైట్ పోటీ మధ్య ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయని.. ముఖ్యంగా జనరల్  ఫ్రెండ్స్ అయితే చెప్పగలరు గాని.. వేవ్స్ అనేవి మాత్రం ప్రజలే సృష్టిస్తారని పలువురు విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఇందులో కొన్ని మాత్రం సక్సెస్ అవుతున్నాయి మరికొన్ని ఫెయిల్యూర్ గా మిగులుతున్నాయని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: