ఆరా మస్తాన్ సర్వే షాకింగ్ ఫలితాలు.. ఏపీలో గెలిచే ఓడిపోయే టాప్ లీడర్స్ వీళ్లే!

Reddy P Rajasekhar
ఏపీ ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి ఎన్ని సర్వే ఫలితాలు వెలువడుతున్నా ఆ సర్వేలలో ఆరా మస్తాన్ సర్వేకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఈ సంస్థ సర్వే ఫలితాలలో భాగంగా ఏపీలో గెలిచే ఓడిపోయే టాప్ లీడర్స్ జాబితాను వెల్లడించింది. ఏపీలో కూటమి తరపున పోటీ చేసిన అచ్చెన్నాయుడు, రఘురామ కృష్ణంరాజు గెలుస్తారని ఈ సంస్థ వెల్లడించగా అదే సమయంలో వైసీపీ నుంచి పోటీ చేసిన వల్లభనేని వంశీ మోహన్ గెలుస్తాడని వెల్లడించింది.
 
అదే సమయంలో వైసీపీ టాప్ లీడర్లుగా పేరును సంపాదించుకున్న తమ్మినేని సీతారాం, బూడి ముత్యాల నాయుడు, విజయసాయిరెడ్డి ఈ ఎన్నికల్లో ఓటమిపాలవుతారని ఆరా మస్తాన్ బాంబు పేల్చారు. వైసీపీకి కీలకమైన నేతలు ఓటమి పాలవుతున్నారని తెలిసి ఆ పార్టీకి ఒకింత కంగారు మొదలైంది. అయితే ఆరా మస్తాన్ రాష్ట్రంలో మళ్లీ వైసీపీదే అధికారమని తేల్చి చెప్పడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.
 
56 శాతం మంది మహిళలు వైసీపీకి అండగా నిలిచారని 94 నుంచి 104 స్థానాల్లో వైసీపీ విజయం సాధించనుందని ఈ సర్వే ఫలితాలలో తేలిపోయింది. కూటమి కేవలం 71 నుంచి 82 స్థానాల్లో మాత్రమే గెలిచే ఛాన్స్ ఉంది. కొన్ని సీన్ల తేడాతో ఏపీలో కూటమి అధికారం కోల్పోయే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే కొన్ని సర్వేలు మాత్రం ఏపీలో కూటమిదే అధికారమని చెబుతున్నాయి.
 
రైజ్, జనగళం, చాణక్య స్ట్రాటజీస్, పయనీర్, పీపుల్స్ పల్స్, కేకే సర్వేస్ సంస్థలు మాత్రం కూటమిదే విజయమని తేల్చి చెబుతున్నాయి. వైసీపీ కేవలం 45 నుంచి 60 స్థానాలకే పరిమితమవుతుందని ఈ సర్వే లెక్కలతో తేలిపోయింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నో సంస్థలు ఫలితాలకు సంబంధించి విశ్వసనీయతను కోల్పోయే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. తెలంగాణలో నిజమైన ఆరా మస్తాన్ సర్వే ఫలితాలు ఏపీలో కూడా నిజం అవుతాయేమో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: