ఆరా మస్తాన్ సంచలనం..ఏపీలో 100 శాతం వచ్చేది ఆ ప్రభుత్వమే ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫలితాలకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉందన్న సంగతి తెలిసిందే. దాదాపు 20 రోజుల నుంచి... ఏపీ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కేంద్రంలో మోడీ సర్కార్ వస్తుందని కచ్చితంగా అందరూ చెప్పగలుగుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో... సర్వే సంస్థలు కూడా అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో కొన్ని సర్వేలు తమ రిపోర్టును రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి.

 
 నాగన్న సర్వే అయితే ఇప్పటికే వైసిపి ప్రభుత్వం ఏర్పడుతుందని తేల్చి చెప్పింది. దీంతో ఇప్పుడు అందరి చూపు ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ పైన ఉంది. ఎందుకంటే వంద శాతం  ఫలితాలను అంచనా వేయడంలో ఆరా మస్తాన్ ఇప్పటికే చాలాసార్లు సక్సెస్  అయింది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో కూడా ఆరా మస్తాన్ సర్వే నిర్వహించింది. అక్కడ ఆరా మస్తాన్... ఎగ్జిట్ పోల్స్...కరెక్ట్ అయ్యాయి.

 
 ఇటు తెలంగాణలో దుబ్బాక ఎన్నికల సమయంలో కూడా ఎగ్జాక్ట్  ఫలితాలను ఆరా మస్తాన్ అంచనా వేయగలిగింది. దీంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై... వాటి ఫలితాలపై... ఆర మస్తాన్ ఇవాళ సాయంత్రం ఎలాంటి ప్రకటన చేస్తుందో అని... అందరూ ఆత్రుతగా చూస్తున్నారు. అయితే వైసీపీకి సపోర్ట్ గా ఆరా మస్తాన్ ఇస్తుందని..ఇప్పటికే తెలుగుదేశం తమ్ముళ్లు ప్రచారం చేస్తున్నారు. అటు వైసిపి పార్టీ కూడా ఇదే తరహా ప్రచారం చేస్తుంది. తెలుగుదేశం పార్టీకి ఆరా మస్తాన్... సర్వే సంస్థ అండగా ఉంటుందని... వైసిపి ఇప్పటికే పేర్కొంది.

 
 ఎందుకంటే... తమకు వ్యతిరేకంగా ఫలితాలు వస్తే... తెలుగుదేశం పార్టీకి ఆరా మస్తాన్ కొమ్ము కాసిందని వైసీపీ చెప్పవచ్చు... ఒకవేళ తెలుగుదేశం కు వ్యతిరేకంగా... ఫలితాలు వస్తే... వైసిపి పార్టీకి ఆరా మస్తాన్ కొమ్ము కాసిందని తెలుగు తమ్ముళ్లు ప్రచారం చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఎగ్జిట్ ఫలితాలు రాకముందే పార్టీలు ఇప్పటికే... ఆరా మస్తాన్ పై బురద జల్లుతున్నాయి. కానీ ఆరా మస్తాన్ సంస్థ... ఎవరికి అమ్ముడుపోయే సంస్థ కాదు. ఎవరికి కొమ్ము కాయదు. ఇప్పటికే చాలాసార్లు ఆ విషయాన్ని రుజువు చేసింది ఆరా మస్తాన్. అయితే... ఇవాళ ఆరున్నర గంటలకు ఆరా మస్తాన్ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: