సమంత నాగచైతన్య విడిపోవడానికి అదే కారణం... బీజేపీ నేత..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటీనటులు అయినటువంటి నాగ చైతన్య , సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే నాగ చైతన్య తన కెరియర్ లో రెండవ సినిమా గా ఏం మాయ చేసావే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా సమయం లోనే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో మనం , మజిలీ అనే మూవీ లు కూడా రూపొందాయి.

మనం సినిమా సమయం లో వీరిద్దరి ప్రేమ మరింత బలపడడంతో వీరు తమ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత వీరిద్దరి జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగింది. ఇక వివాహం తర్వాత నాగ చైతన్య తన సినిమాలతో తాను బిజీగా ఉంటే , సమంత కూడా అనేక సినిమాలలో నటించింది. ఇకపోతే ఏమైందో ఏమో తెలియదు కానీ వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు.

ఇక వీరిద్దరూ విడిపోయి చాలా కాలం అయిన తర్వాత ఫోన్ టాపింగ్ వల్లే నాగ చైతన్య , సమంత విడిపోయారు అని అనేక వార్తలు తెరపైకి వచ్చాయి. ఇకపోతే తాజాగా ఫోన్ టాపింగ్ కేసును సిబిఐ కి అప్పగించాలి అంటూ బిజెపి చేపట్టిన నిరసన దీక్షలో ఆ పార్టీ నేత అయినటువంటి బూర నర్సయ్య గౌడ్ తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు.

ఆయన తాజాగా మాట్లాడుతూ ... ఫోన్ టాపింగ్ వల్లే సమంత , నాగ చైతన్య విడిపోయారని ఆరోపణలను చేశారు. అలాగే ఫోన్ టాపింగ్ కేసును సిబిఐ కి అప్పగించాలి అని కూడా ఈయన నిరసన దీక్ష చేశారు. టాపింగ్ తో ఇతరుల బెడ్ రూమ్ లోకి తొంగి చూశారని ఆయన ఆరోపించారు. హరీష్ రావు ఫోన్ కూడా టాప్ చేసి ఓ ఫైల్ రెడీ చేయించారని ఆయన అన్నారు. ఇక తాజాగా ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nc

సంబంధిత వార్తలు: