ఎన్నికల ఫలితాలు: దేశం చూపంతా ఏపీ వైపే?

Purushottham Vinay
జూన్ 4న వెలువడబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలపైనే దేశం దృష్టి ఉందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జూన్ 4న జరగబోయే కౌంటింగ్ కు చురుగ్గా ఏర్పాట్లనేవి జరుగుతున్నాయి.ఈ టైంలో గెలుపుపై మిగిలిన పార్టీలు ఆ స్థాయిలో ధీమా కనబరుస్తున్నట్లు కనిపించడం లేదు కానీ... వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం గెలుపుపై పూర్తి ధీమాగా ఉన్నారనే కామెంట్లు చాలా బలంగా వినిపిస్తున్నాయి.పోలింగ్ అయిపోయిన తర్వాత ఐప్యాక్ ఆఫీసుకు వెళ్లిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల ఫలితాలపై తనకున్న అంచనాలను ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా... 2019 వ సంవత్సరంలో వచ్చిన 151 సీట్ల కంటే ఎక్కువగానే ఈసారి సాధిస్తామని సీఎం జగన్ తెలిపారు.నిజానికి ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రధానంగా "వైనాట్ 175" అనే అంశాన్ని హైలైట్ చేశారు. తమకు ఎందుకు 175కి 175 రాకూడదో చెప్పాలంటూ  ఆయన ప్రశ్నించేవారు.ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా  నేరవేర్చామని చెబుతూ.. తనవల్ల మంచి జరిగితేనే తనకు ఓటు వేయమని  అడిగారు. దీంతో ఏపీలో కొత్త  రాజకీయాలు మొదలయ్యాయనే చర్చ తెరపైకి వచ్చింది.


ఎన్నికల్లో గెలవడానికి అనవసరమైన ఫీట్స్ అన్నీ చేయకుండా.. కేవలం తన పాలన నచ్చితేనే ఓటు వేయమని అడగడంపై ప్రశంసల జల్లులు  కురిశాయి.పైగా ఈసారి ఏపీలో వచ్చిన ఫలితాల తరువాత దేశం మొత్తం ఇటువైపు చూస్తుందంటూ ఆయన ధీమాగా చెప్పారు. ఈ క్రమంలోనే గతంలో 2019లో గెలిచి మే 30న ప్రమాణస్వీకారం చేసిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ... "ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది" అని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.దీంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ధీమా పీక్స్ అని అంటున్నారు పరిశీలకులు. తన పాలనపై తనకున్న ధీమా వేరే లెవెల్ అని అంటున్నారు. ఈ స్థాయిలో ధీమా వ్యక్తం చేయాలంటే ప్రధానంగా తనపై తనకు నమ్మకం ఉండాలని.. ఆత్మవంచన అనే పదానికి చోటు ఉండకూడదని.. అలాంటప్పుడే ఈ స్థాయి ధీమా తెరపైకి వస్తుందని జనాలు అనుకుంటున్నారు.ఈ స్థాయిలో వైసీపీ అధినేతకు ధీమా ఉన్నప్పుడు ఆటోమెటిక్ గా నేతల్లో కూడా ఆ రేంజ్ ధీమా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అందుకే... జూన్ 9న విశాఖలో జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారానికి అన్ని ఏర్పాట్లూ మొదలైపోయాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: