ఉత్తరాంధ్ర: వైసీపీని టెన్షన్ పెడుతున్న సిక్కోలు?

Purushottham Vinay
జగన్ మోహన్ రెడ్డికి ఎంతో ఇష్టమైన సిక్కోలు  జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ కి ఈసారి రాజకీయ జాతకం కలసి వచ్చిందా లేదా అన్నది వైసీపీని ఇంకా వైసీపీ అనుచరులను టెన్షన్ పెడుతోంది.నరసన్న పేటలో 2004 వ సంవత్సరం నుంచి రాజకీయ ప్రస్థానం మొదలెట్టి ఇప్పటికి నాలుగు సార్లు గెలిచి ఒకసారి ఓడిన ధర్మనా క్రిష్ణ దాస్ అలియాస్ దాసన్నకు ఈ ఎన్నికలు ముచ్చెమటలు పోయించాయని తెలుస్తుంది.పోలింగ్ తరువాత సరళి చూస్తే ఆయన ప్రత్యర్ధి టీడీపీ అభ్యర్థి భగ్గు రమణమూర్తి గట్టి పోటీ ఇచ్చారని అర్ధం అవుతోంది. ఆయన 2014 వ సంవత్సరంలో ఒకసారి క్రిష్ణ దాస్ మీద గెలిచారు. తిరిగి 2019లో ఓడిపోవడం జరిగింది. ఈసారి ఎలాగైనా కూడా గెలిచి తీరాలని పట్టుదల మీద ఉన్నారు.ఆయనకు కింజరాపు కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభించింది. ఈసారి లోపాయికారీ వ్యవహారాలు ఏమీ లేకుడా సైకిల్ ని గెలిపించుకోవాలని గట్టిగానే కింజరాపు కుటుంబం బిగించింది అని తెలుస్తుంది.ఇంకా దాంతో పాటు వైసీపీలో వర్గ పోరు కూడా తోడు అయి దాసన్న ఇబ్బందిలో పడ్డారు అని తెలుస్తుంది.


ఆయన వ్యతిరేక వర్గం టీడీపీలో చేరడంతో బలం అక్కడ విపరీతంగా పెరిగింది. ఇక ధర్మాన కుటుంబానికే ఎపుడూ టికెట్ ఇవ్వడం పట్ల వైసీపీలో ఉన్న వ్యతిరేకతను కూడా తెలుగుదేశం సొమ్ము చేసుకుందని తెలుస్తుంది. ఈ పరిణామాల నేపధ్యంలో భారీ పోలింగ్ అనేది సాగింది. ఈ పోలింగ్ అంతా కూడా తమకు అనుకూలమని రెండు పార్టీలు చెబుతున్నా కూడా వైసీపీలో  కొంత చర్చ సాగుతోంది.తక్కువ ఓట్లతో అయినా దాసన్న బయటపడతారని వైసీపీ అనుచరుల నుంచి తెలుస్తుంది. ఈసారి గెలవకపోతే రాజకీయంగా కూడా దాసన్నకు ఇబ్బంది అవుతుందని తెలుస్తుంది. వాస్తవానికి తన కుమారుడు జెడ్పీటీసీ అయిన క్రిష్ణ చైతన్యకు టికెట్ ఇప్పించుకోవాలని ఆయన చూశారు. కానీ జగన్ మోహన్ రెడ్డి ఆదేశంతో పోటీ పడ్డారు. ఈసారి గెలిస్తే 2029 నాటికి కుమారుడి రాజకీయ వారసత్వం గట్టి పడుతుంది అన్నది ఆయన ఆలోచనగా తెలుస్తుంది.ఏది ఏమైనా ఈయన విషయంలో సిక్కోలు వైసీపీ కాస్త టెన్షన్ లో ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: