ఏపీ : భ‌గ్గుమ‌న్న ప‌ల్నాడు... ర‌క్త‌సిక్తం..!

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది అయితే దేశవ్యాప్తంగా నాలుగోవిడత జరుగుతున్నా లోక్సభ ఎన్నికలు ఉదయం 9 గంటలకు 10.31 శాతం మరియు ఏపీలో 9.21శాతం నమోదైంది అని ఈసీ తెలిపింది.ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఏమీ జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టంగా భద్రత చర్యలు తీసుకుంటున్నారు . ఒకవైపు ఎన్ని పోలీసులు ఎన్ని భద్రత చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని ప్రాంతాలలో టీడిపి వైసిపి మధ్య ఘర్షణ తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో ముఖ్యంగా పలనాడు జిల్లాలో  పోలింగ్ కేంద్రాల్లో నుంచి బయటకు వచ్చి టిడిపి కూటమికి వైసిపి కి మధ్య రాళ్లతో, కర్రలతో ఘర్షణ చోటు చేసుకుంది.అక్కడ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు సిఆర్పిఎఫ్ బృందాలు ఆ ఘర్షణకు కారణమైన కార్యకర్తలను పట్టుకొని నిర్బంధించారు.పల్నాడు జిల్లాలోని మాచర్ల,గురజాల నియోజకవర్గం ఫ్యాక్షనిస్టులకు పెట్టిన పేరు. ఎన్నికలు వస్తున్నాయి అంటే కచ్చితంగా ఆ నియోజకవర్గాల్లోని ప్రజల్లో టెన్షన్ టెన్షన్. అధికార ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేతలు ఆవులను వదిలి ఖాళీ చేసి వేరే రాష్ట్రాలకు పోతా ఉంటారు  ఎందుకంటే అధికార ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెడుతూ పెడుతుంది కనుక వాళ్లు ఏపీ దాటి హైదరాబాద్ బెంగళూరులో చెన్నైలో పోయి ఉద్యోగరీతి అక్కడే ఉంటారు. మరల ఎన్నికలవేళ వచ్చిఓటు హక్కును వినియోగించుకుంటారు.అదేవిదంగా పల్నాడు జిల్లాలోని నరసరావుపేట మండలం రెంటాలలో కూడా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.పోలింగ్ జరుగుతున్నప్పుడు పోలింగ్ బూత్ లలో రిగ్గింగ్ కు పాల్పడేందుకు టీడీపీ వర్గం వాళ్లు కొత్త దారి నిర్మాణం ఏర్పాటుస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. పోలీసుల ప్రమేయంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విధంగా పల్నాడు పోలింగ్ హీట్ టెన్షన్ టెన్షన్ గా నడుస్తుంది.ఈ దాడి ఘటనపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్‌ ప్రారంభానికి ముందే పల్నాడులో గొడవలపై కన్నెర్రజేసింది. తక్షణం పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: