జగన్: తెలంగాణ సీఎంపై సంచలన కామెంట్స్..!

Divya
రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ అధికార నేతలు నియోజవర్గాలలోని అభ్యర్థుల సైతం పలు రకాల ప్రచారాలను చేస్తూ ముందుకు వెళుతున్నారు. మరో రెండు రోజులలో ఎన్నికలు జరుగుతూ ఉండడంతో అటు నేతల మాటల తూటాలుగా పేలుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మధ్య ఒక వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే ..తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఆంధ్రప్రదేశ్ సీఎం తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కడపలో మాట్లాడుతూ చంద్రబాబును గెలిపించేందుకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంట్రీ ఇచ్చిందని మండిపడ్డారు.. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అంటూ కూడా విమర్శించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అయినప్పటికీ పగటిపూట బిజెపితో.. రాత్రిపూట కాంగ్రెస్ తో కాపురం చేస్తారంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.. అయితే ఎన్నికల వేళ ఏపీ సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన ఇలా మాట్లాడడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయం పొలిటికల్ పరంగా కూడా హాట్ టాపిక్ గా మారుతోంది.

ఇదంతా ఇలా ఉండగా చంద్రబాబు గురించి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సమాధానం కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.చంద్రబాబు నాయుడు తనకు గురువు కాదని కేవలం సహచరుడిని మాత్రమే అంటూ వెల్లడించారు.. తాను ఇండిపెండెంట్గా పోటీ చేసిన తరువాతే అక్కడ గెలిచే మళ్ళీ టిడిపి పార్టీలోకి వెళ్లానని కూడా తెలియజేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలకు మరి జగన్ కు కౌంటర్ వేస్తారేమో చూడాలి మరి. రేపటి రోజున ప్రచారం కూడా అన్ని నియోజవర్గాలలో ఆపివేయవలసి ఉన్నది. ఈ విషయం మాత్రం ఇప్పుడు వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: