ఏపీ : నామినేషన్ ప్రక్రియలో పైచేయి ఆ పార్టీదేనా..?

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలలో భాగంగా గురువారం నాటికి నామినేషన్ల ప్రక్రియ పూర్తయిపోయింది. చివరి రోజు అనగా గురువారం నాడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా పులివెందులలో నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే ఓవర్ ఆల్ గా నామినేషన్ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే సాధారణంగా నామినేషన్ వేయడాన్ని ఆ పార్టీలు మరియు అభ్యర్థులు చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. నామినేషన్ అనేది సక్సెస్ అయితే అదొక పాజిటివ్ సంకేతంగా భావిస్తారు. ఈ ప్రక్రియలో తమ వెంట జనాలని తీసుకెళ్లడానికి ఏమాత్రం ముందు వెనుక ఆలోచించరు. దీనికోసం వార్డుల వారీగా ఏరియాల వారీగా డివిజన్ల వారీగా టార్గెట్లు ఇచ్చి మరీ జనాలని పోగు చేస్తారు.ప్రజలు కూడా కొంత అభిమానంతో మరియు ఇంకొంత మంది డబ్బులకి, ముందుమీద ఇంట్రస్ట్తో తిరుగుతారు.అయితే టిడిపి మరియు వైసీపీల నామినేషన్ ప్రక్రియ మొత్తం పరిశీలిస్తే టీడిపి ర్యాలీనే పై చేయిగా నిలిచింది అని చెప్పవచ్చు.

ఈ నామినేషన్ ర్యాలీలో వైసిపి వెనుకంచెలు ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దాంట్లో భాగంగా వైసిపి పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్, వైసీపీ నేతలు జనాన్ని పోగు చేయడంలో అంతగా శ్రద్ధ చూపించకపోవడం, వాలంటీర్ల మీదనే ఆధారపడడం వల్ల కారణం ఏదైనాప్పటికీ నామినేషన్ విషయం లో వైసిపి కొన్నిచోట్ల చేతులెత్తేసింది అని తెలుస్తుంది. దీన్నిబట్టి మొత్తం 175 నియోజకవర్గాలలో దాదాపు నూట ఇరవై ప్లస్ నియోజకవర్గాలలో నామినేషన్ విషయాల్లో మాత్రం టీడీపీకి పైచేయిలో ఉన్నట్లుగా తెలుస్తుంది.అయితే ప్రస్తుతం దీనిపైన వచ్చినా ఈ సర్వేను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎవరేమన్నా వచ్చేది మాత్రం వైసీపీ పార్టీ అని తమకు ప్రజల మద్దతు ఉందని అంటున్నారు.ప్రతి కుటుంబానికి జగనన్న సంక్షేమ పధకాలు అందాయని వాటిని అందుకున్న ప్రజలు మరలా సీఎంగా జగన్ ను చూడాలని భాసిస్తున్నారనన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: