ఏపి : పవన్ తీరులో మార్పులు షాక్ అవుతున్న జనసేన అభ్యర్థులు...!?

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల లక్ష్యంతో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడం ఆయా పార్టీల నేతల్లో అసంతృప్తిని రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కీలక నియోజకవర్గమైన అవనిగడ్డ సీటు జనసేనలో కలకలం రేపింది. జనసేనలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌కు టికెట్ ఖరారు కావడాన్ని ఆ పార్టీ ‘అసలు’ నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఈ తరుణంలో జనసేన శ్రేణులు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి.
అంతేకాకుండా ఈరోజు అవనిగడ్డలో విక్కుర్తి శ్రీనివాస్ నేతృత్వంలో ఆత్మీయ సమావేశం జరగనుంది. శ్రీనివాస్‌కే టిక్కెట్‌ ఇవ్వాలని జనసేన నేతలు, ఆయన అనుచరులు పట్టుబడుతున్నారు. ఈ మేరకు నేటి సమావేశంలో తీర్మానం చేయాలని నిర్ణయించారు. ఈ తీర్మానాన్ని ఆలస్యం చేయకుండా పవన్‌కు పంపడం ద్వారా శ్రీనివాస్‌కి సీటు కేటాయించాలని జనసేన అధిష్టానం ఒత్తిడి పెంచుతుందని భావిస్తున్నారు.
మండలి బుద్ధ ప్రసాద్ గతంలో జనసేనను పిల్లల పార్టీ అని పిలిచారు. జనసేనలో డబ్బుకు సీట్లు అమ్ముకుంటున్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుని ఎక్కువ సీట్లు ఇవ్వాల్సిన అవసరం పవన్ కు ఏముంది?. పార్టీలో అర్హులు ఎవరూ లేరా? న్యాయంగా చూస్తే ఆ టికెట్ నాకే దక్కాలి. కానీ, చివరి నిమిషంలో దాన్ని మార్చేశారు’’ అని విక్కుర్తి శ్రీనివాస్ అన్నారు.
మరోవైపు అవనిగడ్డలో జనసేన అభ్యర్థిని మాత్రమే బరిలోకి దింపాలని పోరాడుతున్నామని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ తెలిపారు. మా బిడ్డకు మరొకరు తండ్రి అవుతారని ఎదురు చూస్తూ కూర్చోబోమని ఖండించారు. మాకు కాకుండా వేరొకరికి టిక్కెట్ ఇస్తే అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు.
10 ఏళ్ల నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని వీడలేదు. ఒక్క సీటు గెలిచినా కష్టకాలంలో కూడా పవన్ వెంటే నడిచాం. ఆత్మగౌరవం పక్కన పెట్టి పరాయి పార్టీల జెండాలు మోశాం. చంద్రబాబు, పవన్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్‌ను పార్టీలో చేర్చుకుని టిక్కెట్టు కేటాయింపునకు రంగం సిద్ధం చేస్తారా? అనీ.. జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: