పవన్‌ ప్రకటనతో అక్కడ సంబరాలు, సెగలు?

Purushottham Vinay
ఫైనల్‌గా పిఠాపురంలో సమరానికి సిద్ధమయ్యారు జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటనతో జనసేన శ్రేణులు ఇప్పుడు సంబరాల్లో బాగా మునిగిపోయారు.అయితే టీడీపీలో మాత్రం అసమ్మతి అగ్గిరాజేసింది. ఈ ఆగ్రహజ్వాల ఏ వైపు టర్న్ అవుతుందోనన్న ఆందోళన కూటమిని ఎంతగానో కలవరపెడుతోంది.ఇక పొత్తులో భాగంగా వరుసగా స్థానాలు ప్రకటిస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌.. తాను పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇచ్చారు.మంగళగిరిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని స్వయంగా పవన్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ప్రకటనను జనసేన శ్రేణులు చప్పట్లతో స్వాగతించారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మాత్రమే ఉందని.. ఎంపీగా పోటీపై పెద్దల సూచనలు తీసుకుంటానని పవన్ అన్నారు.పిఠాపురంలోనే పవన్‌ కళ్యాణ్ ఎందుకు పోటీ అన్నదానిపై చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఈ సెగ్మెంట్‌లో 90వేలకు పైగా కాపు ఓట్లనేవి ఉన్నాయి. ఈ ఈక్వేషన్‌లో సూపర్ విక్టరీ ఖాయమన్న అంచనాలు ఉన్నాయి.


గతంలో కూడా తన అన్న ప్రజారాజ్యం పార్టీకి ఊపునిచ్చిందీ స్థానం. అదే జోరు ఈసారి కూడా కొనసాగుతుందని జనసేన పార్టీ లెక్కలేసుకుంటోంది. ఇక వారాహి యాత్రకు అనూహ్య స్పందన రావడం పోటీకి మరోక కారణంగా కనిపిస్తోంది. సొంతంగా చేయించుకున్న సర్వేలన్నీ కూడా పాజిటివ్ రిపోర్ట్స్‌ ఇచ్చాయి. వీటన్నింటితో పాటు కాపు నేతల సవాళ్లకు సమాధానంగా ఇక్కడ పోటీ చేసి గెలవాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్టు పూర్తిగా స్పష్టమవుతోంది.జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనతో జనసేన శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్న వేళ టీడీపీలో ఆగ్రహజ్వాల భగ భగ భగ్గుమంది. ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ అనుచరులు అయితే టీడీపీ ఫ్లెక్సీలు, జెండాలు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. వర్మకే టీడీపీ టికెట్ కి ఇవ్వాలని డిమాండ్ చేశారు.పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ ప్రకటనపై స్పందించిన వర్మ.. గత 20 ఏళ్ల నుంచి తెలుగు దేశం పార్టీతో ఉన్నానని గుర్తు చేసి వెళ్లిపోయారు. ఇక పిఠాపురంలో అసమ్మతి సెగకు అధిష్ఠానం ఎలా ఫుల్‌స్టాప్ పెడుతుంది? వర్మను ఎలా దారికి తెచ్చుకుంటుంది? ఎటువంటి హామీతో శాంతిపజేస్తుందన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: