ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాష్ట్రమంతా పొలిటికల్ సీజన్ షురూ అయింది. పైగా దీనికి తోడు పొలిటికల్ టచ్ ఉన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతుండడంతో ఏపీకి ఎన్నికల ఫీవర్ అనేది మరింత పెరిగిపోయింది.ఇక యాత్ర-2 సినిమా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక రేపోమాపో వ్యూహం సినిమా కూడా థియేటర్లలోకి రానుంది. దీంతో పొలిటికల్ రియల్ ఫైట్లో రీల్ ఫైట్స్ కూడా ఎంతో ఆసక్తిని రేపుతున్నాయి. పొలిటికల్ సీజన్ నడుస్తున్న క్రమంలో అటు ఎన్నికల వేడి…ఇటు థియేటర్లలో ఆ వేడిని మరింత పెంచేస్తున్న పొలిటికల్ టచ్ ఉన్న సినిమాలు గొడవలు రేకెత్తించాయి. తాజాగా యాత్ర-2 ఏపీలోని పలు హాళ్లలో సందడి చేస్తోంది. నిన్న హైదరాబాద్ లోని ఓ థియేటర్ లలో జగన్ పవన్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత, జగన్ సీఎం అయ్యేదాకా సాగిన ఆయన రాజకీయ ప్రస్థానంపై కథ నడుస్తుంది.
అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమా చూడాలంటున్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఇక రాజమండ్రిలో వైసీపీ ఎంపీ మార్గాని భరత్, ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్, వైసీపీ లీడర్లు ఇంకా కేడర్…ఈ మూవీని థియేటర్లో చూశారు. యాత్ర- 2 సినిమా విడుదల సందర్భంగా థియేటర్ దగ్గర వైసీపీ నేతలు టపాసులు పేల్చారు. వైఎస్ మరణం తర్వాత జగన్ మోహన్ రెడ్డి సింగిల్గా పోరాటం చేశారని, ఢిల్లీ పెద్దలను ఎదిరించి గెలిచారన్నారు భరత్. యాత్ర-3 సినిమా కూడా ఉంటుందన్నారు ఆయన. సత్తెనపల్లిలోని ఓ హాల్లో యాత్ర-2 సినిమాని చూశారు మంత్రి అంబటి రాంబాబు.అన్ని వర్గాల వారు ఆదరించే విధంగా ఈ సినిమా ఉందన్నారు ఆయన. కర్నూలులో కూడా కేక పుట్టించేలా థియేటర్ల బయట యాత్ర-2 సినిమా సంబరాలు జరిగాయి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సీఎం జగన్కు అభిమానులుగా మారతారన్నారు.