2000 నోట్లపై.. నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన?

praveen
వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసి మోదీ ప్రభుత్వం రూ.2000 నోట్లను ప్రవేశపెట్టింది. కొన్నేళ్ల క్రితం 2000 నోట్లు ఏటీఎంలో బాగా కనిపిస్తుండేవి. కానీ ఆ తర్వాత ఎక్కువగా కనిపించడం లేదు దాంతో 2000 నోట్లను ప్రింట్ చేయడం ఆపేసారని కావాలనే వీటిని ప్రభుత్వం ఏటీఎంలో ఉంచకూడదని ఆదేశించిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని తాజాగా ఒక లిఖిత పూర్వక సమాధానం ద్వారా నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. లోక్‌సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు నిర్మల సీతారామన్ తాము ఏ బ్యాంకులకు 2000 నోట్ల విషయంలో ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని పేర్కొన్నారు.
ఉద్దేశపూర్వకంగా నోట్లను ఏటీఎంలో ఉంచాలని గానీ లేదా ఉంచొద్దని గానీ కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు సూచించలేదని ఆమె వెల్లడించారు. నోట్లను ఏటీఎంలో ఉంచాలా ఉంచొద్దా అనే విషయం సంబంధిత బ్యాంకుల చేతుల్లోనే ఉంటుందని ఆమె వివరించారు. కాలాన్ని, ప్రాంతాలలోని అవసరాలను బట్టి బ్యాంకులో సొంతంగా ఏటీఎంలో ఉంచాల్సిన నోట్ల విషయంలో నిర్ణయాలు తీసుకుంటాయని కూడా ఆమె తెలిపారు.
ఇక 2017 నాటికి రూ.9.512 లక్షల కోట్ల విలువైన రూ.500, రూ.2,000 నోట్లు ఇండియాలో సర్కులేషన్లో ఉన్నాయని.. 2022 నాటికి వాటి విలువ 27 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. అంతేకాకుండా మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేంద్ర ప్రభుత్వానికి 2023, మార్చి 31 నాటికి రూ.155.8 లక్షల కోట్ల అప్పు ఉంటుందని అంచనా వేశారు.
ఇదిలా ఉండగా 2019-20, 2020-21,, 2021-22 మధ్యకాలంలో కొత్త రూ.2,000 డినామినేషన్ కరెన్సీ నోట్లను ముద్రించలేదని రైట్‌-టు-హక్కు వెల్లడించింది. ఆ తర్వాత ఏటీఎంలలో 2000 నోట్లు కనిపించకపోవడంతో, ఈ నోటును ప్రభుత్వం చలామణి నుంచి తీసేసే అవకాశం ఉందని ఊహగానాలు వెల్లువెత్తాయి. కాగా దీనిలో నిజం లేదని, ఏటీఎంలో బ్యాంకులో 2000 నోట్లను ఉంచడం లేదని తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: