2024 ఎన్నికలు: కాంగ్రెస్ కీలక నిర్ణయం?

Purushottham Vinay
ఇక కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం సన్నాహాలు ప్రారంభించిందే. ఇప్పటికే పలు సమావేశాలు ఇంకా సభలను నిర్వహించిన కాంగ్రెస్ అగ్రనేతలు..దేశ వ్యాప్తంగా కూడా పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు.ఇక దీనికి చింతన్ శిబిర్ వేదికైంది. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు 'భారత్ జోడో యాత్ర' చేపట్టాలని కూడా నిర్ణయించారు. అయితే.. ఈ యాత్ర అక్టోబర్ 2  తేదీ గాంధీ జయంతి రోజున ప్రారంభించాలని పార్టీ నిర్ణయించింది. కానీ.. మళ్లీ ముందుగానే పాదయాత్రను ప్రారంభించాలని కూడా నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 7 వ తేదీ నుంచి కాంగ్రెస్ 'భారత్ జోడో యాత్ర' ప్రారంభం కానుందని ఆ పార్టీ ప్రకటించింది.సెప్టెంబర్ 7 వ తేదీ న కన్యాకుమారి నుంచి యాత్ర ప్రారంభమై కాశ్మీర్‌లో ముగుస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. యాత్ర 12 రాష్ట్రాల మీదుగా మొత్తం 3,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పూర్తి కావడానికి దాదాపు 150 రోజులు పడుతుంది. ఇక రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్ర నేతలంతా పాదయాత్రలో పాల్గొంటారని ఏఐసీసీ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ తెలిపారు. 


అలాగే ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ చింతన్ శిబిరం 'నవ్ సంకల్ప్'లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా 'భారత్ జోడో యాత్ర'ను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే భారత్ జోడో యాత్ర ఆర్గనైజింగ్ కమిటీకి దిగ్విజయ్ సింగ్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.ఇక ఈ మేరకు దిగ్విజయ సింగ్  పలు విషయాలను ప్రస్తావించారు. "భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వం.. సర్వ ధర్మ సంభవను విశ్వసించే ప్రజలందరినీ కూడా ఏకం చేయాలన్న (జోడో ఇండియా) ప్రచారాన్ని ప్రారంభించాలని స్వాతంత్ర్య సమరయోధుడు జిజి పారిఖ్ జీ పేర్కొన్నారని.. ఇంకా ఇది ఈ రోజు నుంచి ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాగా.. కాంగ్రెస్ 2024 ఎన్నికల్లో తమ అవకాశాలను బాగా మెరుగుపరుచుకునేందుకు ఈ యాత్రతో ముందుకు సాగే వ్యూహంగా భావిస్తోంది. ఇక దీనిలో భాగంగా ఇప్పటికే భారత్ జోడో రూట్ మ్యాప్‌ను కూడా రెడీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: