ఢిల్లీ : ఎంపీగా రాజీనామా చేయకపోవటానికి కారణమిదేనా ?

Vijaya



వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు వైఖరి గురించి కొత్తగా ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. నిలువెల్లా జగన్మోహన్ రెడ్డి అంటే మండిపోయే ఎంపీ ఇదే సమయంలో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, బీజేపీ అంటే ఎనలేని అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. జగన్ పై కసైనా పై చంద్రబాబు, పవన్ పై అభిమానాన్ని ఎంపీయేమీ బాహాటంగానే ప్రదర్శిస్తున్నారు.




మొన్నటివరకు ఎంపీ పదవికి రాజీనామా చేస్తనని డెడ్ లైన్లు విధించిన ఎంపీ తాజాగా రాజీనామా చేయబోనని తెగేసి చెప్పేశారు. రాజీనామా చేస్తా..ఉపఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలుస్..జగన్ కు తన గెలుపుతో బుద్ధిచెబుతా అంటు రాజుగారు చేసిన ప్రకటనలన్నీ ఉత్త సోదే అని తేలిపోయింది. నిజానికి ఎంపీ పదవికి రాజీనామా చేసే ఉద్దేశ్యం ఎంపీకి ఏనాడు లేదు. ఎందుకంటే ఎంపీ పదవికి రాజీనామా చేస్తే తరువాత ఏమవుతుందో మిగిలిన వారికన్నా ఆయనకే బాగా తెలుసు.




అందుకనే తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతు ఎట్టి పరిస్ధితుల్లోను ఎంపీ పదవికి రాజీనామా చేసేదిలేదని చెప్పేశారు. ఎందుకంటే ఎంపీగా రాజీనామా చేస్తే తనను చంపేస్తారంటు భయపడుతున్నారు. ఎందుకు చంపుతారు ? ఎవరు చంపుతారనే విషయాలు చెప్పకుండా దాటేశారు. అంటే ఈ విషయం చెప్పటానికి కూడా భయపడుతున్నట్లు అర్ధమవుతోంది. పైకి చెప్పకపోయినా అందరు ఎంపీకి జగన్ నుండి ప్రాణహాని ఉందని అనుకోవాలన్నది ఎంపీ ఉద్దేశ్యం అయ్యుందచ్చు.




ఎంపీ పదవన్నది తనకు రక్షణకవచంగా ఎంపీ చెప్పుకున్నారు. రక్షణకవచం లేకుండా బయటతిరిగితే తనను చంపేస్తారనే భయం ఎంపీలో బాగా కనబడుతోంది. కాబట్టి ఎంపీగా రాజీనామా చేసే ఆలోచన రఘురాజులో ఎప్పుడూ లేదన్న విషయం ఇపుడు అర్ధమైపోయింది. ఇంతకాలం రాజీనామా చేస్తా, ఉపఎన్నికల్లో పోటీచేస్తా, బంపర్ మెజారిటితో గెలుస్తా అని చేసిన ప్రకటనలన్నీ ఉత్త సొల్లు మాత్రమే. సరే ఇపుడంటే ఎంపీగానే ఉంటారు బాగానే ఉంది. మరి రేపటి ఎన్నికల్లో మళ్ళీ నరసాపురంనుండే పోటీచేస్తానని చెబుతున్న ఎంపీ అప్పుడైనా నియోజకవర్గంలో తిరగాలికదా ? మరపుడు ఏమి చేస్తారు ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: