గుడ్ న్యూస్.. 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు?
కాగా మంచిర్యాల జిల్లాలోని జైపూర్ లో ఇప్పటికే 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఉండడం గమనార్హం. ఇక ఈ విద్యుత్ ప్లాంటు ఉన్న ప్రాంగణంలోనే కొత్తగా థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఇక కొత్తగా నిర్మించబోయే థర్మల్ విద్యుత్ కేంద్రం కోసం 6790 కోట్లు నిధులు అవసరం ఉంటుందని పాలక మండలి అంచనా వేసింది. ఇక దీంతోపాటు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తో కలిసి మందమర్రి వద్ద మరో 50 వేల టన్నుల పేలుడు పదార్థాల ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించడం గమనార్హం.
ఇప్పటికే ఆ ప్రాంతంలో 50 వేల టన్నుల పేలుడు పదార్థాల ఉత్పత్తి కేంద్రాలు అందుబాటులో ఉన్నాయ్ అని చెప్పాలి. దీని సామర్థ్యాన్ని
ఇప్పుడు లక్షకు పెంచాలని డీపీఆర్ పాలకమండలి నిర్ణయించింది. ఏదేమైనా సింగరేణిలో 95 శాతం ఉద్యోగాలు స్థానిక జిల్లాల వారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంపై స్థానిక ప్రజలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.