ఏపీలో వంట నూనెల ధరల్లో మోసం... విజిలెన్సు దాడులు కీలక విషయాలు?
అయితే యుద్ధం వలన ఆయిల్ ధరలు పెరుగుతాయి అని చెప్పంగానే, పెరగడం వాస్తవమో లేదో తెలియదు కానీ ఇక్కడ కిరాణా షాపుల యజమానులు తమకు తామే పెంచేస్తున్నారు. అయితే సరుకులు కొనడానికి వెళ్లిన ప్రజలు ఈ విషయం గమనించి లబోదిబోమంటుంటే దీనిపై ప్రభుత్వం అప్రమత్తం అయింది. చిత్తూరు జిల్లా లోని తిరుపతిలో పాళీ షాపులలో విజిలెన్సు అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీలలో అధికారులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. వాటిలో ముఖ్యంగా చూస్తే, వంట నూనెలను సాధారణ ధరల కంటే అధిక మొత్తానికి అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.
అంతే కాకుండా ఇంకా అధిక లాభానికి అమ్ముకోవడానికి కొంత మొత్తంలో ఆయిల్ ప్యాకెట్ లను నిల్వ చేసుకున్నారని ఈ తనిఖీలో బయట పడింది. అయితే ఒక్క సరిగా ఒక్కో ఆయిల్ ప్యాకెట్ ధరను 150 నుండి 180 రూపాయల మేరకు పెంచుకుని అమ్ముతున్నారట. అయితే ఇలా బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న షాప్ యజమానులపై విజిలెన్సు అధికారులు తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని చోట్ల 185 రూపాయలుగా కూడా అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.